రండి రండి రండి దయచేయండి తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ..........

ఎంకన్న సొమ్ము.. ఎటెళ్లుతోంది?


98 ధార్మిక సంస్థలకు నిధులు
100 కోట్ల నష్టాల్లో ఎస్వీ ఛానెల్‌
దేనిపైనా నియంత్రణ లేదు
7 ఫౌండేషన్లుగా చక్కదిద్దాలి

ఓ ప్రవహించే నదిలోంచి ఒక్కొక్కరుగా బకెట్లతో నీళ్లు ముంచుకొని వెళుతుంటే... ఎవరెన్ని బకెట్ల నీళ్లు తీసుకెళ్లారనేది ఎలా తెలుస్తుంది? సామర్థ్యం ఉన్న వ్యక్తి నాలుగు బకెట్లు ఎక్కువ తీసుకెళ్లినా నదీ ప్రవాహంలో నీటి లెక్క తెలీదు. ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే)లో పరిస్థితి కూడా ఇదే
తితిదేలో ఆదాయ వ్యయాలు అంతు చిక్కవు. ఎంకన్నస్వామికి ఎంత ఆదాయం వస్తుందో లెక్క తేలని పరిస్థితి కాబట్టి ఖర్చుల్ని కూడా అదే రీతిలో చేయాలన్నట్లుంది ప్రస్తుత తితిదేలో పాలనా వ్యవహారం. గత 50 ఏళ్లలో ధార్మిక సంస్థల పేరిట తితిదే అనేక పథకాల్ని చేపట్టింది. ఇప్పటి వరకూ సుమారు 98 అకౌంటింగ్‌ యూనిట్లు తితిదే నుంచి నిధులు పొందుతున్నాయి. ఇన్ని యూనిట్ల వ్యయ పద్దుల్ని సరిచూసేందుకు పటిష్టమైన ఆడిటింగ్‌ విభాగం తితిదేలో లేదు. అన్ని పథకాల అమలు తీరును, నిధులను మంజూరు చేయాల్సిన బాధ్యత కార్యనిర్వహణాధికారి(ఈఓ)పై ఉంది. ఉదాహరణకు... ఆరోగ్యానికి సంబంధించి 16 ప్రాజెక్టులు తితిదే పరిధిలో పనిచేస్తున్నాయి. ఇందులో శ్రీవేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(స్విమ్స్‌) వంటి పెద్ద సంస్థతోపాటు ఆయుర్వేద ఆస్పత్రులు, డిస్పెన్షరీలూ ఉన్నాయి. విద్యాభివృద్ధి కోసం 14 సంస్థలు, ధర్మ ప్రచార పరిషత్తు కోసం 11 సంస్థలు... ఇలా అనేక రకాల ప్రాజెక్టుల కింద మొత్తం 98 యూనిట్లు నిధులు ఖర్చుచేస్తున్నాయి. ఒక సంస్థ పెద్ద ఆసుపత్రికని నిధులు కోరితే, మరొక అధికారి గోసంరక్షణకని తీసుకుంటారు. ఏ పథకం కోసం ఎవరికి ఎప్పుడు నిధులు కావాల్సి వచ్చినా.. నేరుగా పాలక మండలిలో తీర్మానం చేయించుకుంటారు. ఆ మేరకు కార్యనిర్వహణాధికారి నిధుల్ని మంజూరుచేస్తారు. ప్రభుత్వం మారగానే, పాలక మండలి మారుతుంది. కొత్త పాలక మండలి రాగానే మరికొన్ని కొత్త పథకాలను ప్రారంభించడం, వాటికి నిధులు మంజూరు చేయడం.. ఈ క్రమంలోనే అకౌంట్‌ యూనిట్ల సంఖ్య వందకు దగ్గరైంది. దేనిపైనా ఆడిట్‌ లేదు. ఏ పథకంపై ఎంత ఖర్చు పెడుతున్నామనే లెక్క తెలియదు. ఉదాహరణకు స్విమ్స్‌కు ఈ ఏడాది రూ.20 కోట్లు మంజూరు చేశారనుకుంటే... ఆ రూ.20 కోట్లు దేని కోసం ఖర్చుపెట్టారు? దానివల్ల ఫలితం ఎంత? ఎంతమంది ప్రయోజనం పొందారు? వచ్చే ఏడాది ఇంతకంటే ఎక్కువ మంజూరుచేయాలా? అసలు అవసరం లేదా? అనే వివరాలేవీ తితిదే వద్ద లేవు. ఇది ఒక్క సంస్థకు సంబంధించింది కాదు... 98 యూనిట్ల పరిస్థితి ఇంతే! ఇలా కొన్నేళ్లుగా వేల కోట రూపాయలు తితిదే నుంచి మంజూరవుతున్నాయి. ఉదాహరణకు శ్రీవేంకటేశ్వర భక్తి ఛానెల్‌ ఒకటి. ఇది ఇప్పటికే దాదాపు రూ.100కోట్లు నష్టాల్ని మూటగట్టుకుంది. ఏటా దీనిపై రూ.30 కోట్లు ఖర్చుపెడుతుంటే... దీని ఆదాయం రూ.3 కోట్లను మించడం లేదు. వీటినన్నింటినీ ఒక్క ఎగ్జిక్యూటివ్‌ అధికారే సమర్థంగా నిర్వహించడం అనేది అసాధ్యమని మాజీ ఐపీఎస్‌ అధికారి సి.ఆంజనేయరెడ్డి తితిదేపై గత ఏడాది ఇచ్చిన నివేదికలో స్పష్టంచేశారు. ఈ భక్తి ఛానెల్‌కు వచ్చే మూడేళ్లలో పైసా ఇవ్వకూడదని, దాని సొంత ఆదాయాన్ని పెంచుకుని నడిపించుకోవాలని, మూడేళ్లలో అలా నిలదొక్కుకోలేకపోతే ఆ ఛానెల్‌ను మూసేయాలని నివేదికలో ఆంజనేయరెడ్డి స్పష్టంచేశారు. ఇలా వివిధ పథకాల కింద 98 అకౌంట్‌ యూనిట్లుగా ఉన్నవాటిని 7 ఫౌండేషన్లుగా విభజించాలని ఆయన సూచించారు. అవి...

* విద్య
* ఆరోగ్యం
* ధర్మ ప్రచార పరిషత్‌
* అన్నదానం ట్రస్ట్‌
* చారిత్రక, సాంస్కృతికం
* సాంఘిక సంక్షేమం
* గోసంరక్షణ

ఒక్కో గ్రూపు కిందికి సంబంధిత యూనిట్లను తీసుకురావాలి. ఇలా ఏడు ఫౌండేషన్లను స్థాపించి, వాటి ద్వారా సంబంధిత విభాగాలకు నిధులు ఖర్చు చేయాలి. ఈ ఏడు ఫౌండేషన్లు కూడా వేటికవే స్వతంత్ర సంస్థలుగా రూపొందించాలి. వాటికి మూల ధనమిచ్చి ఆర్థికంగా సహకరించాలే గానీ తితిదే ఆధ్వర్యంలో నడిపించకూడదు. రామకృష్ణ మిషన్‌, భారతీయ విద్యా భవన్‌... వంటి లాభాపేక్ష లేని స్వచ్ఛంద సంస్థలకు అప్పగించాలి. ప్రతి ఫౌండేషన్‌ను ఒక ట్రస్ట్‌గా ఏర్పాటుచేయాలి. ముగ్గురు సభ్యులుగా ఉండే ఆ ట్రస్టీలో తితిదే పాలకమండలి సభ్యుడు ఒకరు, సంబంధిత విభాగంలో నిపుణులు ఇద్దరు సభ్యులుగా ఉండాలి. తితిదే ఇచ్చిన నిధులను వారే పర్యవేక్షిస్తారు. ఎంత ఖర్చు పెడుతున్నారు? ఎవరెవరికి ఖర్చుపెడుతున్నారు? ఏవిధంగా ఖర్చుపెడుతున్నారు? అనే లెక్కల్ని సరిచూస్తారు. వార్షిక నివేదికలు అందజేస్తారు. దీనివల్ల తితిదేకు నియంత్రణ వస్తుంది. మొత్తంగా ఎవరెవరికి ఎంత ఖర్చుపెడుతున్నామో తెలుస్తుంది.

మేలికోలుపా లేక ఉసిగోలుపా.......ఇది





Nobody is right till somebody is wrong

Nobody is weak till somebody is strong

Nobody is lucky till somebody is along

Nobody is lonely till somebody is gone

I MISS YOU DEAR

I hide my tears when I say your name,

but the pain in my heart is still the same.

There is no one Who misses you more than ME

నేటి సాయంత్రం వేళలో... సాగర తీరంలో....
ఇసుక తిమ్మేరలపై కూర్చున్న నిన్ను చూసి....
అలా అలా అలనై నీ పాదాలు ముద్దాడే సమయాన...
నీ కాలి మెట్టెలు నా హృదయాన్ని గాయం చేస్తే....
కెరటాన్నై ఎగసి నిన్ను కౌగిలిలో బంధించాలనే నా ఆవేశాన్ని..
నీ మెడలో కదలాడే ఏదో బంధం నన్ను అదుపు చేస్తే......
ఆ నిజాన్ని నా గుండెల్లో దాచుకుని .......
కాల గర్భంలో కలిసి పోయింది మరో ప్రేమ కధ అని ........
నీతో గడిపిన క్షణాలను తలచుకుంటూ.....
మౌనంగా కడలి ఓడిలో కలిసి పోయాను.....


Funny Love Letter

My dear FAIR and LOVELY (ek chand ka tukda) , you are my TVS SCOOTY
(first love) and my AIWA (pure passion) . I always BPL (believe in
the best) and you are SANSUI (better than the best). You are DOMINO'S
PIZZA (delivering a million smiles) for me. This is a COLGATE ENERGY
GEL (seriously fresh) feeling for me.

I want you to be my life partner but I think you are worried about
your father who is KAWASAKI BAJAJ CALIBER (the unshakable) and my
father who is CEAT (born tough) , but don't worry as I am also FORD
ICON (The josh machine) and rest of our family members are pretty
KELVINATORS (the coolest ones). If our fathers say no, we will run
away and marry, and PHILIPS (let's make things better).

They will feel MIRINDA (zor ka jhatka dhire se lage) but I believe in
COCA-COLA (jo chahe ho jaye) . Trust in God who's always NOKIA
(connecting people) who love each other. And do not forget that we
are WILLS (made for each other).

Now that HYUNDAI (we are listening) the song of love, you must know
that love is DAIRY MILK (real taste of life), SATYAM ONLINE (fun fast
easy) and PARX (always comfortable). So never forget me.

Ok bye!

I wrote little but actually PEPSI (yeh dil mange more)!!.

Yours
LG (digitally yours).

గోవిందుడు.. మళ్లీ అప్పులపాలు!


ఈ అపరాధం దేవస్థానందే
అన్నదానం ట్రస్టు నిధుల మళ్లింపు
మూలధనమూ కదిలించారు
ఇక నిర్వహణ భారమే!


తిరుమల, న్యూస్‌టుడే: అలనాడు శ్రీనివాసుడు పద్మావతి అమ్మవారి పరిణయం సందర్భంగా కుబేరుడి వద్ద తీసుకున్న అప్పు నేటికీ తీరలేదు. భక్తులు చెల్లించే కానుకల ద్వారా వడ్డీ మాత్రమే చెల్లిస్తున్నాడు. అందుకే గోవిందుడుకి వడ్డీకాసులవాడనే పేరొచ్చింది. ఆ అప్పు సంగతి అలా ఉంటే.. తితిదే పాలక పెద్దలు స్వామి నెత్తిన మరో అప్పుల భారం మోపారు. భక్తులు ఏనాడూ కోరకపోయినా శ్రీ వారి నిత్య అన్నదానం పథకం కింద ముద్దపప్పు, నెయ్యి వడ్డింపును అదనంగా చేర్చారు. పాలకమండలి మాజీ సభ్యుడొకరు కందిపప్పు, నెయ్యి సరఫరా చేస్తున్నారు. ఆయన కోసమే ఈ పథకాన్ని చేర్చారనే విమర్శలు వచ్చాయి. దీంతో నిత్య అన్నదానం ట్రస్టుకు నెలా వారీ వ్యయం రూ.కోటి నుంచి రూ.1.50 కోట్లకు చేరుకుంది. ఇదే సమయంలో తితిదే విద్యాలయాల వసతిగృహాల్లో క్యాంటిన్లను అన్నదానం ట్రస్టు కింద నిర్వహించాలనే తీర్మానం పాలకమండలి చేసింది. దేవస్థానం ఉన్నతాధికారులూ మారు మాట్లాడకుండా అంగీకరించారు. ఈ తీర్మానాన్ని అన్నదానం ట్రస్టు తీవ్రంగా వ్యతిరేకించింది. స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు అన్నదానం చేయడానికే దాతలు విరాళాలు ఇచ్చారు తప్ప క్యాంటిన్లకు కాదని తేల్చిచెప్పింది. ఈ వ్యవహారంపై వారు న్యాయస్థానానికి వెళితే సమస్య తీవ్రమవుతుందని ట్రస్టు హెచ్చరించింది. విరాళాలు అందించే దాతలకు ఆదాయపు పన్ను రాయితీ వర్తింపు రద్దవుతుందని కూడా సూచించింది. అయినా తితిదే పెడచెవిన పెట్టి వసతి గృహాలకు అన్నదానం పథకం విస్తరించింది. విధిలేని పరిస్థితిలో అన్నదానం ట్రస్టు వసతి గృహాల్లోనూ క్యాంటిన్ల నిర్వహణ భారం ఎత్తుకుంది. దీంతో ట్రస్టు రుణ భారం రూ.17,47,67,057 మేరకు పెరిగింది. భక్తులు బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసిన మూలధనం నుంచి నిబంధనలు అతిక్రమించి రూ.రెండు కోట్లు (31-3-2008 నాటికి) తీసి ఖర్చు పెట్టారు. భక్తులిచ్చే డిపాజిట్లపై తితిదేకు ఎలాంటి అధికారంలేదు. ఆ డిపాజిట్లను రద్దు చేయడం, ఆ నిధుల్ని నేరుగా వినియోగించుకోవడం చట్టరీత్యా నేరం. పెరిగిపోయిన రుణ భారంపై ఆందోళన చెందిన నిత్య అన్నదానం ట్రస్టు తితిదేకు హెచ్చరిక చేస్తూ ఇటీవల నివేదిక అందచేసింది. నివేదికలోని అంశాలు...

* అన్నదానం ట్రస్టు కింద డిపాజిట్లు రూ.168,14,54,776. ఈ మొత్తంపై ఏడాదికి వచ్చే వడ్డీ మొత్తం రూ.27,20,40,447గా అంచనా.
* తిరుమలలో నిత్య అన్నదానంతో పాటు వైకుంఠం-2, పీఏసీ-2, తిరుచానూరులో అన్నదానంకు ఏడాదికి రూ.22,25,37,196 ఖర్చు. తితిదే విద్యాసంస్థల వసతిగృహాల్లో క్యాంటిన్ల నిర్వహణకు రూ.11,49,46,141 ఖర్చు.
* ఏడాది ఖర్చు రూ.33,74,83,337 కాగా వడ్డీ రూపంలో వచ్చే ఆదాయం 27,20,40,447 మాత్రమే. ఆదాయానికి, ఖర్చు మధ్య ఉన్న వ్యత్యాసం రూ.ఐదు కోట్లు ఏవిధంగా భరించాలని నివేదికలో తితిదేను ప్రశ్నించింది.
* గత ఏడాదిలో అప్పుల భారం రూ.17,47,67,057గా తేల్చింది. ఈ భారం ఏ విధంగా పూడ్చుకోవాలో అర్థం కాక అన్నదానం ట్రస్టు నిర్వాహకులు తలపట్టుకున్నారు. ఈ పరిస్థితిపై పలుమార్లు నివేదిక ఇచ్చినప్పటికీ పట్టించుకోలేదు.

డిసెంబరులో శిల్పాశెట్టి పెళ్లి!


ముంబయి: పొడుగుకాళ్ల సుందరి.. బాలీవుడ్‌ భామ శిల్పాశెట్టి త్వరలోనే పెళ్లి కూతురు కానుంది. ప్రియుడు రాజ్‌కుంద్రాతో కలిసి ఏడడుగులు నడవనుంది. అయితే ఈ విషయాన్ని గోప్యంగా ఉంచాలనుకున్నా సాధ్యం కాలేదు. డిసెంబరులో లండన్‌లో ఆమె పెళ్లి జరగనుందనే విషయం బయటకు పొక్కింది. తన పాస్‌పోర్టు ఇప్పించాలని శిల్ప తండ్రి సురేంద్రశెట్టి సూరత్‌ కోర్టును ఆశ్రయించడంతో ఈ గుట్టు కాస్త రట్టయింది. లండన్‌లో జరిగే తన కూతురు వివాహా వేడుకలకు హాజరవ్వాలని అందులో సురేంద్ర పేర్కొన్నట్లు ఓ వార్తా సంస్థ తెలిపింది. దీంతో ప్రియుడు రాజ్‌కుంద్రాతో శిల్ప వివాహం ఎప్పుడనే విషయమై గత కొద్ది రోజులుగా నెలకొన్న ఉత్కంఠ తొలగిపోయింది. వివాహ అనంతరం శిల్ప లండన్‌లోనే స్థిరపడే అవకాశాలు కన్పిస్తున్నాయి. చీరల వ్యాపారిపై బెదిరింపులకు దిగిన కేసులో 2003లో సురేంద్రశెట్టి పాస్‌పోర్టును కోర్టు స్వాధీనం చేసుకుంది.

శ్రీగణనాథం భజామ్యహం




శుక్లాంబర ధరం విష్ణుం
శశివర్ణం చతురు్భజం
ప్రసన్నవదనం ధ్యాయేత్‌
సర్వవిఘ్నోప శాంతయే

వినాయకుడంటే ముందుగా గుర్తొచ్చేది ఈ శ్లోకమే. కానీ గణపతి అంటే తెల్లని వస్త్రాలూ చంద్రుని వర్ణం నాలుగు భుజాలూ ప్రసన్న వదనమే కాదు. అరివీరభయంకర వీరగణపతిగానూ సిరిసంపదలనిచ్చే లక్ష్మీగణపతిగానూ... ఇలా విభిన్న ఆహార్యాలతో 32 రూపాలలో కొలువై ఉన్నాడని చెబుతోంది ముద్గల పురాణం. వాటిలోనూ పదహారు రూపాలు మరింత ప్రశస్తమైనవని నమ్మిక. ఆ పదహారు రూపాలనే షోడశగణపతులుగా ఆరాధిస్తారు భక్తులు. తమిళనాడులోని కాల్పాతి ఆలయంలో ఈ షోడశగణపతులనూ ఒక్కచోటే చూడవచ్చు. ఈ గణపతుల్లో ఒక్కొక్క స్వామిని పూజిస్తే ఒక్కొక్క ఫలితం లభిస్తుందని విశ్వసిస్తారు భక్తులు. వినాయక చవితి పర్వదినం సందర్భంగా ఆయా మూర్తుల రూపాలూ వివరాలూ...


బాల గణపతి


ఉదయించే సూర్యుని రంగులో మెరిసిపోయే స్వామి బాలగణపతి. బాలగణపతి పసిమనస్తత్వానికి గుర్తుగా ఆయన నాలుగు చేతుల్లో... అరటిపండు, మామిడి పండు, చెరకు గడ, పనసపండు కనిపిస్తాయి. ఆయనకు ఇష్టమైన ఉండ్రాయిని తొండంతో పట్టుకుని ఉంటాడు. పేరుకు తగ్గట్టుగా ఈ స్వామి చేతుల్లో ఆయుధాలు లేకపోవడం గమనించాల్సిన విశేషం. బాలగణపతిని భక్తిగా పూజిస్తే శ్రద్ధగా పరిశీలించే శక్తి కలుగుతుందనీ కోరిన కోర్కెలు తీరుతాయనీ నమ్మిక.

తరుణ గణపతి


అంటే యవ్వన దశలో ఉన్న వినాయకుడు. తరుణ వయస్కులకు సహజమైన రోషం, శౌర్యానికి గుర్తుగా ఈ స్వామి ఎనిమిది చేతుల్లోనూ రెండిట్లో పాశం, అంకుశం కనిపిస్తాయి. మిగతా హస్తాల్లో వెలగపండు, వరికంకులు, దంతం, కుడుము, నేరేడు, చెరకుగడ ఉంటాయి. తరుణగణపతి రుధిరవర్ణంలో ఉంటాడు. దీర్ఘకాల అనారోగ్యాలతో బాధపడేవారు తరుణగణపతిని భక్తితో పూజిస్తే ఆయా రోగాల నుంచి త్వరగా విముక్తి లభిస్తుందని ప్రతీతి. అలాగే ఈ స్వామిని భక్తితో కొలిస్తే చేపట్టిన కార్యాన్ని సాధించితీరాలనే నమ్మకం కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

భక్త గణపతి


శరత్కాల చంద్రునిలా తెలుపు రంగులో ఉండే స్వామి భక్త గణపతి. ప్రశాంతతకూ నిర్మలత్వానికీ గుర్తు. అందుకు తగ్గట్టుగానే ఈ స్వామి చేతుల్లో కొబ్బరికాయ, మామిడిపండు, అరటిపండు, క్షీరాన్నం ఉంటాయి. ఉపాసన చేసేవారు, మోక్షాన్ని కోరుకునేవారూ సాధారణంగా భక్త గణపతిని పూజిస్తారు.

వీరగణపతి


పేరులోనే వీరత్వం ఉట్టిపడే వీరగణపతిని శత్రుసంహారకుడిగా పూజిస్తారు భక్తులు. ఎరుపురంగు శరీరం. పదహారు చేతులు, అన్ని హస్తాల్లోనూ ఆయుధాలే. ధనుస్సు, బాణం, చక్రం, త్రిశూలం, భేతాళం, పరశువు, ఖడ్గం, గద, పాశం, అంకుశం, ఈటె, సుత్తి, పాము, పలుగు, గండ్రగొడ్డలి, శక్తి... భీకర రూపుడిగా కనిపిస్తాడు వీరవినాయకుడు. ఈ స్వామిని నిత్యం భక్తితో కొలిస్తే శత్రువులపై సులభంగా విజయాన్ని సాధించే శక్తినీ ధైర్యాన్నీ ఇస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

శక్తి గణపతి


సూర్యాస్తమయ సమయాన ఆదిత్యుడిలాగా జేగురు రంగులో మెరిసే ఈ స్వామి ఎడమ తొడపై అమ్మవారిని(శక్తి)ని కూర్చుండబెట్టుకుని ఉంటాడు. కనుకనే ఈయనను శక్తి గణపతిగా వ్యవహరిస్తారు. శక్తివినాయకుడి నాలుగు హస్తాల్లో అంకుశం, పూలదండ ఉంటాయి. మరో హస్తం అభయమిస్తున్నట్టుగా అభయముద్రలో ఉంటుంది. తాంత్రిక ఉపాసనలు చేసేవారు ఎక్కువగా ఈ శక్తిగణపతిని ఆరాధిస్తారు. ఈస్వామిని మనసారా ధ్యానిస్తే అన్ని భయాలూ తొలగిపోతాయని నమ్మిక.

సిద్ధి గణపతి


బంగారురంగు కలిసిన పసుపు వర్ణంలో భక్తుల పూజలందుకునే స్వామి సిద్ధిగణపతి. మామిడిపండు, పూలగుత్తి, చెరుకుగడ, గొడ్డలి చేపట్టి ఉంటాడు. సిద్ధిగణపతిని ఆరాధిస్తే మంత్రసిద్ధి కలుగుతుందని ప్రతీతి. ఈయన భక్తుల కోరికలను తీర్చి మోక్షాన్నీ అన్నింటా విజయాన్నీ ప్రసాదించే స్వామి అని నమ్మిక.

ఉచ్చిష్ట గణపతి


వినాయకుడి తాంత్రిక స్వరూపమే ఈ రూపు. నీలివర్ణంలో ‘శక్తి'సమేతుడై కొలువుండే ఉచ్చిష్టగణపతి హస్తాల్లో నీలి రంగు కలువ, దానిమ్మ పండు, వరికంకులు, వీణ, జపమాల ఉంటాయి. స్థిరాస్తి, ఇతర వ్యాపార రంగాల్లో ఎదురయ్యే కష్టాలను తొలగించుకోవడానికి ఉచ్చిష్టగణపతిని పూజిస్తారు. న్యాయం తమవైపు ఉండీ కోర్టుకేసుల్లో కాలజాప్యం అవుతున్నప్పుడు ఈస్వామిని కొలిస్తే ఫలితం లభిస్తుందని భక్తుల నమ్మకం. ఉచ్చిష్ట గణపతి ఆరాధనలో ఏమాత్రం తేడావచ్చినా దుష్ఫలితాలు కలుగుతాయని ఉపాసకులు అంటారు.

విఘ్న గణపతి


సర్వవిఘ్నాలనూ రూపుమాపే స్వామి విఘ్నగణపతి. బంగారు రంగులో ఉండే ఈ స్వామికి ఎనిమిది చేతులు. ‘శుక్లాంబరధరం విష్ణుం...' శ్లోకంలో చెప్పినట్టు ఈ వినాయకుడు విష్ణురూపుడు. అంటే ఆ శ్రీహరి లాగా ఈ స్వామి చేతుల్లో శంఖచక్రాదులు కనిపిస్తాయి. ఇంకా చెరుకుగడతో చేసిన విల్లు, బాణం, పాశం, గొడ్డలి, పూలదండ ఉంటాయి. ఈయననే నిర్విఘ్న గణపతి, విఘ్నరాజ గణపతి, భువనేశ గణపతి అని కూడా అంటారు. ఈస్వామిని పూజిస్తే శత్రువుల నుంచి రక్షణ లభిస్తుందనీ అన్నింటా విజయం లభిస్తుందనీ నమ్మిక.

క్షిప్ర గణపతి


కోరిన కోర్కెలు త్వరగా నెరవేరాలనుకునేవారు మందారపువ్వు రంగులో మనోహరంగా ఉండే క్షిప్రగణపతిని పూజిస్తారు. ఈ స్వామి చేతుల్లో విరిగిన దంతం(ఆయనదే), కల్పవృక్ష శాఖ(కోర్కెలు తీర్చేందుకు గుర్తుగా), పాశం, అంకుశం ఉంటాయి. తొండంతో రత్నఖచిత కలశాన్ని పట్టుకుని ఉంటాడు. నమ్మి కొలిచిన భక్తులపై తన కరుణాకటాక్షాలతో పాటు సిరిసంపదలనూ కురిపించే స్వామి ఈ క్షిప్రగణపతి అని ప్రతీతి.

హేరంబ గణపతి


బలహీనులను సదా కాపాడే స్వామి సింహవాహనుడైన హేరంబగణపతి అని భక్తుల విశ్వాసం. ఐదుముఖాలతో హరితవర్ణంలో ఉండే ఈ స్వామి చేతులు అభయ, వరద ముద్రల్లో ఉంటాయి. మిగతా చేతుల్లో పాశం, దంతం, జపమాల, పూలదండ, గొడ్డలి, సుత్తి, ఉండ్రాయి, తీపికుడుము, పండు ఉంటాయి. అత్యంత కష్టసాధ్యమైన కార్యాన్ని సాధించాల్సి వచ్చినా ప్రయాణాల్లో ప్రమాదాలు కలగకూడదన్నా హేరంబగణపతిని ధ్యానిస్తే చాలంటారు భక్తులు.

మహా గణపతి


ఎడమ తొడపై ‘శక్తి'ని కూర్చుండబెట్టుకుని ఉండే మహాగణపతి తాంత్రిక స్వరూపుడు. గోధుమ వర్ణంలో ఉండే ఈ స్వామి మూడుకన్నులూ... తలపై నెలవంకతో తన తండ్రి అయిన శివుణ్ని స్ఫురింపజేస్తాడు. చేతుల్లో దానిమ్మపండు, చెరకుగడ, కమలం, విల్లు, చక్రం, పద్మం, పాశం ఉంటాయి. కోరినకోర్కెలనన్నిటినీ తీరుస్తాడనీ సిరిసంపదలూ ఆయురారోగ్యాలూ కలగజేస్తాడనీ భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఏలిననాటి శని ఉన్న సమయాల్లో చేపట్టిన పనుల్లోనూ విఘ్నాలు కలగకుండా కాపాడే స్వామి అని నమ్మిక.

ద్విజ గణపతి

నాలుగుముఖాలతో ఉండే స్వామి ద్విజగణపతి. పేరుకు తగినట్టుగానే ఈయన ఆహార్యం బ్రాహ్మణుని స్ఫురించే విధంగా ఉంటుంది. శ్వేతవర్ణంలో ఉండే ఈ స్వామి చేతిలో దండ, కమండలాలూ తాళపత్రగ్రంథాలూ ఉంటాయి. ద్విజగణపతిని ఆరాధిస్తే జ్ఞానాన్ని ప్రసాదిస్తాడని భక్తుల విశ్వాసం. ఈ మూర్తిని ధ్యానించే విద్యార్థుల ఆలోచనా శక్తి పెరిగి చదువులో మంచి ప్రతిభాపాటవాలు చూపుతారని ప్రతీతి.

లక్ష్మీ గణపతి


లక్ష్మీగణపతి అంటే ఇప్పుడు చాలాచోట్ల కనిపిస్తున్నట్లు ఒడిలో లక్ష్మీదేవిని కూర్చుండబెట్టుకున్న వినాయకుడు కాదు. సిద్ధి, బుద్ధి సమేతంగా కొలువైన విఫే్నుశ్వరుడే అసలైన లక్ష్మీగణపతి. రెండుచేతులా ఇరువురు అమ్మవార్లనూ దగ్గరకు తీసుకున్నట్టుగా ఉంటాడు. ఒకచేయి వరదముద్రలో ఉంటుంది. మిగతా చేతుల్లో పాశం, అంకుశం, చిలుక, కల్పవృక్ష శాఖ, కమండలం, కత్తి, దానిమ్మ పండు ఉంటాయి. ఈయన రంగు శ్వేత వర్ణం. వృత్తివ్యాపారాల్లో వృద్ధినిచ్చే స్వామి ఈ లక్ష్మీగణపతి అని నమ్మిక.

వూర్ధ్వ గణపతి


ఎనిమిది చేతులతో బంగారు మేనిఛాయలో ఒడిలో హరితవర్ణంలో ఉండే శక్తిని కూర్చుండబెట్టుకుని ఉండే స్వామి వూర్ధ్వగణపతి. ఈయన కూడా తాంత్రిక స్వరూపుడేనని కొందరి విశ్వాసం. నీలిరంగు పుష్పాలు, వరికంకి, తామరపువ్వు, చెరకువిల్లు, బాణం, దంతం ధరించి ఉండే వూర్ధ్వగణపతిని పూజిస్తే భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుందని నమ్మిక. వూర్ధ్వగణపతిని భక్తితో పూజిస్తే తెలిసి చేసిన పాపాలు కూడా పోతాయంటారు భక్తులు.

విజయ గణపతి


సాధారణంగా అందరూ పూజించే స్వామి విజయగణపతి. నాలుగు చేతుల్లో పాశం, అంకుశం, దంతం, మామిడిపండుతో... ప్రసన్నవదనంతో కనిపించే మూషికవాహనుడు. పేరులోనే ఉన్నట్టుగా వృత్తి, ఉద్యోగం, వ్యాపారం... ఇలా ఏ రంగంలోనైనా అన్ని అడ్డంకులనూ తొలగించి శాశ్వత విజయాన్ని సిద్ధింపజేసే స్వామి విజయగణపతి అని ప్రతీతి.

నృత్య గణపతి


బంగారు వర్ణంలో మెరిసిపోతూ ఆనందతాండవంచేసే మూర్తి నృత్యగణపతి. ముఖంలో ఆనందానికి భిన్నంగా చేతుల్లో పాశం, అంకుశం, గొడ్డలి, దంతం వంటి ఆయుధాలు ఉంటాయి. అట్టే సమయంలేని దశలో... తక్షణమే తీరాల్సిన కోరికలేవైనా ఉంటే అలాంటివారు నృత్యగణపతి ఆరాధన చేస్తే వెంటనే ఫలితం లభిస్తుందనీ... తృప్తి, మనశ్శాంతి లభిస్తాయని నమ్మిక.

ఈ షోడశగణపతులే కాదు... ఏకాక్షర, వర, త్యక్షర, హరిద్రా, క్షిప్రప్రసాద, ఏకదంత, సృష్టి, ఉద్దండ, రుణమోచన, డూండి, ద్విముఖ, త్రిముఖ, సింహ, యోగ, సంకటహర, దుర్గ గణపతి... ఇలా పార్వతీ తనయుని మరో పదహారు రూపాలను కూడా విశదంగా వివరిస్తోంది ముద్గల పురాణం. ఏకాక్షర గణపతి భయాలను తొలగించి అభయమిస్తే ఏకదంత గణపతి అజ్ఞానాన్ని పారద్రోలతాడనీ... త్రినేత్రుడైన వర గణపతి, కల్పవృక్షచా్ఛయలో ఆసీనుడైన క్షిప్రప్రసాద గణపతి సిరిసంపదలను ఒసగే స్వాములు కాగా ద్విముఖ గణపతి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడని నమ్మిక. విద్యలో పురోగతి ఆశించేవారు త్యక్షర గణపతినీ మానసిక సుఖశాంతులకు హరిద్రాగణపతినీ ఆరాధిస్తారు(హరిద్రా గణపతి అంటే పసుపుముద్ద వినాయకుడు. సాధారణంగా ఇంట్లో ఏ శుభకార్యం అయినా గణపతిపూజ పేరిట పసుపుతో చేసిన విఫే్నుశ్వరుడికే తొలిపూజ చేస్తారు. హరిద్రా గణపతికి నైవేద్యం పెట్టి ఉద్వాసన పలికాకే అసలు పూజ మొదలవుతుంది). ఇక, ప్రశాంత చిత్తం కోరుకునేవారు త్రిముఖ గణపతినీ దుఃఖాల్లో కూరుకుపోయినవారు ఆ బాధ నుంచి విముక్తి కోసం సృష్టిగణపతినీ భూతప్రేతపిశాచాది భయాలతో బాధపడేవారు ఆ భయాలను తొలగించుకోవడానికి ఉద్దండ గణపతినీ పూజిస్తారు. రుణబాధల నుంచి విముక్తి పొందడానికి రుణమోచన గణపతినీ అఖండ ఆయురారోగ్యాల కోసం డూండి గణపతినీ ఆరాధించే ఆచారం ఉంది. సింహవాహనుడై, సింహముఖుడై విరాజిల్లే సింహగణపతిని పూజిస్తే ఎలాంటి భయమైనా తొలగిపోతుందని ప్రతీతి. బ్రహ్మజ్ఞానానికీ యోగతత్వానికీ ప్రతీక అయిన యోగ గణపతిని ఆరాధించినవారికి ఏకాగ్ర చిత్తం అలవడుతుందని చెబుతారు. దుర్గ గణపతిని ఆరాధించిన వారికి అపజయం అన్నదే ఉండదని పురాణప్రవచనం. ఇక ముప్ఫైరెండు మూర్తుల్లో ఆఖరి రూపు సంకటహర గణపతి. ఈ స్వామిని ఆరాధిస్తే అన్ని అడ్డంకులూ కష్టాలూ ఇబ్బందులూ బాధలూ సమస్యలూ తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

20 వేల హెచ్‌1బీ వీసాలు ఖాళీ

వాషింగ్టన్‌:భారతీయులు తీవ్రంగా పోటీపడే అమెరికా వీసాల్లో ఈసారి బోలెడు ఖాళీలున్నాయి. హెచ్‌1బీ వీసాల్లో 20 వేలు మిగిలి ఉన్నాయి. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కాబోతుండగా ఇన్నేసి ఖాళీలు ఉండటం ఇదే తొలిసారి. ఆగస్టు 7 నాటికి హెచ్‌1బీ వీసాల కోసం 49 వేల దరఖాస్తులు మాత్రమే వచ్చాయని అమెరికా పౌరసత్వ, వలస సర్వీసుల విభాగం అధికారులు పేర్కొన్నారు. 2010 ఆర్థిక సంవత్సరానికి వీసాల జారీ కోసం ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచే దరఖాస్తుల స్వీకరణ మొదలుపెట్టారు. తొలి అయిదురోజుల్లో 42 వేల దరఖాస్తులు రాగా, ఆ తర్వాత నెలన్నర కాలంలో కేవలం 7 వేలే వచ్చాయి. నాలుగు నెలలుగా దరఖాస్తులు స్వీకరిస్తున్నా, ఖాళీలు అలాగే మిగిలిపోయాయి. ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ మందగమనం, నిబంధనల్ని నిక్కచ్చి అమలు, పెద్దమొత్తంలో దరఖాస్తుల్ని తిరస్కరించటం కూడా ఈ పరిస్థితి తలెత్తటానికి కారణంగా భావిస్తున్నారు.

Happy Birthday Ramesh

Happy Birthday Ramesh Alapaati


నివారణ చర్య

దగ్గుతున్నప్పుడు, తుమ్ముతున్నప్పుడు తప్పనిసరిగా నోటికి, ముక్కుకు గుడ్డ లేదా టిష్యూ పేపర్‌ అడ్డుపెట్టుకోండి. ఆ వెంటనే టిష్యూ పేపర్‌ పారెయ్యాలి. గుడ్డ అయితే ఉతకటానికి వేడినీటిలో వేసెయ్యాలి. చి చేతులు, వేళ్లు తరచుగా కళ్లు, ముక్కులు, నోటికి తగలకుండా చూసుకోండి. చిజలుబు లక్షణాలున్న వారి దగ్గరకు వెళ్లద్దు. ఎవరైనా తుమ్ముతున్నా, దగ్గుతున్నా.. వారి మనసుకు కష్టం కలగకుండానే.. ఓ మీటరు దూరంలో ఉండటం మేలు. చి ఫ్లూ జ్వర లక్షణాలు కనబడుతుంటే వెంటనే డాక్టరుకు చూపించుకోవటం అవసరం. మీ లక్షణాల గురించి ముందే ఆసుపత్రి సిబ్బందికి చెబితే.. మిమ్మల్ని త్వరగా చూసి అక్కడి నుంచి పంపేస్తారు. చి ఇంట్లోనూ, ఆఫీసులోనూ కూడా చేతులను తరచుగా సబ్బుతో కడుక్కోండి. ముఖ్యంగా దగ్గు, తుమ్ము తర్వాత తప్పనిసరిగా కడుక్కోండి. ముక్కు చీదిన ప్రతిసారీ చేతులు కడుక్కోవాలి. చి చుట్టుపక్కల ఎవరికి ఫ్లూ లక్షణాలున్నా తరచుగా చేతులు కడుక్కోవటం, మాస్కులు పెట్టుకోవటం.. ఈ రెండు చర్యలతోనే ఫ్లూ జ్వరాల వ్యాప్తిని చాలా సమర్థంగా అడ్డుకోవటం సాధ్యపడుతోందని అధ్యయనంలో తేలింది.

తీవ్రతలోనే తేడా
ఫ్లూ జ్వరానికీ, స్వైన్‌ఫ్లూ జ్వరానికీ ఆరంభ లక్షణాల్లో పెద్దగా తేడా ఉండదు. కాకపోతే మొదలైన తర్వాత.. సాధారణ ఫ్లూ జ్వరం దానంతట అదే క్రమేపీ తగ్గిపోయే రకం అయితే.. స్వైన్‌ ఫ్లూ మాత్రం చాలా వేగంగా ఊపిరితిత్తులను దెబ్బతీస్తుంది. ఊపిరితిత్తుల్లోని కణజాలం దెబ్బతినటంతో పాటు లోపలంతా నీరు చేరిపోయే ప్రమాదం ఎక్కువ. దీంతో వేగంగా మరణం ముంచుకొస్తుంది. అందుకే ప్రస్తుత పరిస్థితుల్లో గొంతునొప్పి, తలనొప్పి, జ్వరం వంటి ఫ్లూ లక్షణాలు కనబడితే దాన్ని నిర్లక్ష్యం చెయ్యటానికి లేదు. తప్పకుండా వైద్యులను సంప్రదించాలి.
నివారణ సాధ్యమే ముక్కుకు గుడ్డ కట్టుకోవటం, చేతులను తరచూ కడుక్కోవటం- ఈ రెండు చర్యల ద్వారానే ఫ్లూ, స్వైన్‌ఫ్లూలను నివారించుకోవటం సాధ్యమని తాజాగా రెండు అధ్యయనాలు స్పష్టంగా తేల్చి చెప్పాయి. ప్రస్తుతం జ్వరాలు వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో రోగులను ఆసుపత్రుల్లో చేర్చి, పూర్తిగా అందరికీ దూరంగా ఉంచటం సాధ్యం కాకపోవచ్చు. అందుకని ప్రతి ఒక్కరూ ఇంటి వద్దనే జాగ్రత్తలు తీసుకోవటం అవసరమని హాంకాంగ్‌ యూనివర్సిటీ పరిశోధకులు సూచిస్తున్నారు. ఫ్లూజ్వర బాధితులున్న 154 ఇళ్లలో అధ్యయనాలు చేసిన వీరు కొన్ని ముఖ్యమైన సూచనలు చేస్తున్నారు.
లక్షణాలు
దగ్గు,
తుమ్ములు
గొంతు నొప్పి
ముక్కు కారటం
వికారం,
నీళ్ల విరేచనాలు
తీవ్ర జ్వరం
తలనొప్పి
తీవ్రమైన బడలిక,
నిస్సత్తువ
విపరీతమైన ఒళ్లు నొప్పులు

పురంధేశ్వరి కుమార్తె వివాహ రిసెప్షన్‌


విశాఖపట్నం, న్యూస్‌టుడే: కేంద్రమంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి కుమార్తె నివేదిత వివాహ రిసెప్షన్‌ సోమవారం రాత్రి విశాఖలోని వాల్తేరు క్లబ్‌లో జరిగింది. విశాఖకు చెందిన అరుణ్‌తో నివేదిత వివాహం ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన విషయం తెలిసిందే. రిసెప్షన్‌కు సినీ హీరో బాలకృష్ణ ఆయన సతీమణి వసుంధరలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. బాలకృష్ణ సోదరుడు జయకృష్ణ, తారకరత్న, కేంద్రమంత్రి పల్లంరాజు, రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి, మాజీమంత్రి కొణతాల రామకృష్ణ, మేయరు జనార్దనరావు, డి.ఐ.జి సౌమ్యమిశ్రా, కలెక్టర్‌ శ్యామలరావు, జీవీఎంసీ కమిషనర్‌ శ్రీధర్‌, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌, అధికారులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

Easy and Fast Weight Loss:

Tips for Easy and Fast Weight Loss:

Tip 1: Must drink minimum 8 glasses of water in a day.

Tip 2: Juices, cream, sugar in your coffee or tea all add up.

Tip 3: Water helps in reducing weight in effective manner.

Tip 4: Have 5 to 6 small meals or snacks in a day.

Tip 5: Make habit of walking. Walk for at least 45 minutes.

Tip 6: Eat more vegetables like zucchini, tomatoes.

Tip 7: Eat only when your stomach wants food.

Tip 8: Avoid package (processed) and convenient foods.

Tip 9: Take the stairs instead of taking the elevator.

Tip 10: Eat fruit rather than juice, low in calories helps.

Tip 11: Eating whole foods will keep you satisfied for longer period of time than juice.

Tip 12: Eat equal portions of vegetables and grains at dinner. Prefer not eating with a large group.

Tip 13: After every 2 hours, get up and walk around the office or your home for 5 minutes.

Tip 15: A brisk five-minute walk after every two hours will your body active. Skip watching TV for an hour.

మాంద్యం తరుణంలో ఎస్‌బీఐ


ఇంటర్మీడియట్‌ అర్హతతోనే బ్యాంకులో ఉద్యోగం సంపాదించుకోవటానికి ఇప్పుడో మంచి అవకాశం వచ్చింది. డిగ్రీ, పీజీలు పూర్తిచేసినవారు కూడా దీనికి పోటీ పడటం సహజం. ఈ పోటీ ఎంతన్నది ఆలోచించకుండా చిత్తశుద్ధితో అవిరళంగా కృషి చేస్తే బ్యాంకులో పాగా వేయటం అసాధ్యమేమీ కాదు!
ఎక్కడ చూసినా ఉద్యోగాల కోత వార్తలే. మాంద్యం తరుణంలో ప్రతిష్ఠాత్మకమైన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) భారీ సంఖ్యలో ఉద్యోగులను నియమించుకోబోవటం విశేషమే. ఆర్థిక మందగమనం వెంబడిస్తున్నా చెక్కుచెదరక, చక్కని ఫలితాలు సాధించిన ‘అత్యుత్తమ' బ్యాంకు ఎస్‌బీఐ.
అందుకే... 11 వేల క్లర్కుల నియామకం కోసం ఎస్‌బీఐ తాజాగా నోటిఫికేషన్‌ వెలువరించింది. ఇందులో మన రాష్ట్రానికి 900 ఖాళీలున్నాయి. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ సెప్టెంబరు 15. ‘ఆన్‌లైన్‌' ద్వారా మాత్రమే దరఖాస్తు చేయాలి. (ఇందుకోసం అభ్యర్థులకు ఈ-మెయిల్‌ ఐడీ తప్పనిసరిగా ఉండాలి). పరీక్ష తేదీలు నవంబరు 8, 15.

విద్యార్హత: 60 శాతం మార్కులతో ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణత లేదా 40 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత
వయసు: 18 నుంచి 28 సంవత్సరాల మధ్య.
వెబ్‌సైట్‌:www.sbi.co.in email: crpd@sbi.co.in

సమీప ఎస్‌బీఐ బ్రాంచిలో రూ. 250 డిపాజిట్‌ స్లిప్‌ ద్వారా చెల్లించి రిసీట్‌ పొందాలి. ఈ వివరాలను ఆన్‌లైన్‌ దరఖాస్తులో వివరించాలి.

ఆంధ్రప్రదేశ్‌లో పరీక్షా కేంద్రాలు
1.హైదరాబాద్‌ 2. తిరుపతి, 3. విజయవాడ 4. విశాఖపట్టణం
అభ్యర్థుల ఎంపిక రాత పరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా జరుగుతుంది.
ఆబ్జెక్టివ్‌ తరహాలో ఉండే రాత పరీక్షలో 5 విభాగాలు ఉంటాయి.
1. జనరల్‌ అవేర్‌నెస్‌ 2. జనరల్‌ ఇంగ్లిష్‌ 3. క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ 4. రీజనింగ్‌ ఎబిలిటీ 5.మార్కెటింగ్‌ ఆప్టిట్యూట్‌/కంప్యూటర్‌ నాలెడ్జి

రాత పరీక్షకు కనీస క్వాలిఫైయింగ్‌ మార్కులు 40 శాతంగా నిర్ణయించారు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ- రెండింటిలో ఉమ్మడిగా వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్‌ లిస్టు రూపొందిస్తారు.
ఎలా సిద్ధమవ్వాలి?
విభాగాల వారీగా ప్రిపరేషన్‌ విషయానికి వస్తే.. మొదటిది జనరల్‌ అవేర్‌నెస్‌.
అత్యధిక మార్కుల సాధనకు అవకాశం ఉన్న ఈ విభాగపు ప్రిపరేషన్‌ విషయంలో అభ్యర్థులు ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. కరెంట్‌ అఫైర్స్‌ విభాగంలో ఎక్కువభాగం ప్రశ్నలు ఆర్థిక రంగ అంశాలపైనే ఉంటాయి. వీటితోపాటు బ్యాంకింగ్‌, కొత్త పుస్తకాల విడుదల, విదేశాంగ పరమైన అంశాలు కూడా ప్రాధాన్యం కలిగి ఉంటాయి.

జనరల్‌ అవేర్‌నెస్‌ ప్రిపరేషన్‌లో ఎప్పటికప్పుడు అంశాలను ‘అప్‌డేట్‌' చేసుకుంటూ ఉండాలి. ప్రతి రోజూ న్యూస్‌ పేపర్‌ చదవడంతో పాటుగా ‘బ్యాంకింగ్‌ సర్వీసెస్‌ క్రానికల్‌', ‘కాంపిటీషన్‌ సక్సెస్‌ రివ్యూ' లాంటి ప్రామాణిక మ్యాగజీన్‌లను అభ్యర్థులు క్రమం తప్పకుండా చదవాలి.

ఇంగ్లిష్‌ ప్రిపరేషన్‌లో అత్యంత ముఖ్యమైన విభాగాలు గ్రామర్‌, ఒకాబులరీ. ఫండమెంటల్‌ గ్రామర్‌ పై పూర్తి అవగాహన పెంచుకోవడం, ఒకాబులరీ పెంపొందించుకోవడం ద్వారా ఇంగ్లిష్‌ విభాగంలో ఎక్కువ మార్కులు స్కోరు చెయ్యడానికి అవకాశం ఉంది.

క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ విభాగంలో శాతాలు, సరాసరి, నిష్పత్తి- అనుపాతం, లాభం- నష్టం, వడ్డీ, భాగస్వామ్యం వంటి టాపిక్స్‌ ముందుగా ప్రిపేర్‌ అవ్వడం ద్వారా డాటా ఇంటర్‌ప్రిటేషన్‌ను త్వరగా, కచ్చితంగా చెయ్యడం సాధ్యపడుతుంది.

అలాగే, క్లరికల్‌ పరీక్షలకు మరో ముఖ్యమైన అంశం సూక్ష్మీకరణ. ప్రాథమిక గణిత సమీకరణాలను బాగా సాధన చెయ్యాలి. దీనితోపాటు permutation and combination, Number series మొదలైనవి అభ్యాసం చేయాలి.

క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ విభాగం ఎక్కువ సమయం పట్టే విభాగం. అందువల్ల ఈ విభాగాన్ని చివరగా ప్రారంభించడం ద్వారా సమయం వృథా కాకుండా చూడవచ్చు.

రీజనింగ్‌ విభాగంలో ప్రశ్నలకు లాజికల్‌ ధింకింగ్‌ ద్వారానే ఎక్కువ సమాధానాలు చెయ్యడం సాధ్యం అవుతుంది. ఇచ్చిన ప్రశ్నలను క్షుణ్ణంగా పరిశీలించి ‘లాజిక్‌' పట్టెయ్యటం ముఖ్యం.
నాన్‌ వెర్బల్‌ ప్రశ్నలకు సైతం ప్రశ్నను క్షుణ్ణంగా పరిశీలిస్తే సమాధానం గుర్తించడం తేలిక.

క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ రీజనింగ్‌ విభాగాలకు సంబంధించి సాధన ఎంత ఎక్కువగా చేస్తే అంత సులువుగా సాల్వ్‌ చేయడానికి వీలవుతుంది.

గత పరీక్షల పేపర్లు, ప్రాక్టీసు పేపర్ల మెటీరియల్‌ విస్తృతంగా లభ్యం అవుతుంది. అందువల్ల వీలయినన్ని ఎక్కువ పేపర్లు ప్రాక్టీసు చేయడం ద్వారా ఈ విభాగాలలో బాగా మార్కులు పొందొచ్చు.

మార్కెటింగ్‌ ఆప్టిట్యూడ్‌, కంప్యూటర్‌ నాలెడ్జి రెండూ కలిపి ఒక విభాగంలో ఉంటాయి. మార్కెటింగ్‌ ప్రిపరేషన్‌ విషయంలో- ప్రస్తుత మార్కెటింగ్‌ విషయాలను పరిశీలన చేసి పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు. అంటే మార్కెటింగ్‌ ప్రిపరేషన్‌ విషయంలో టెక్‌స్ట్‌ బుక్‌ ప్రిపరేషన్‌ పాత్ర తక్కువ. మార్కెటింగ్‌ మౌలిక అంశాల ప్రిపరేషన్‌ కోసం ప్రామాణిక పుస్తకాలను ప్రిపేర్‌ అయితే సరిపోతుంది.

బ్యాంకులకు సంబంధించిన ప్రొడక్ట్స్‌ మార్కెటింగ్‌ ఇన్సూరెన్స్‌ మొదలైన అంశాలపై అవగాహన పెంచుకోవాల్సి ఉంటుంది. కంప్యూటర్‌ నాలెడ్జి విషయంలో మౌలికాంశాల పట్ల అవగాహన అవసరం. చిన్న చిన్న విషయాలపై (సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌, ప్యాకేజీ, లాంగ్వేజీ- వాటి మధ్య భేదాలు) ప్రశ్నలు వస్తుంటాయి. దాదాపుగా డిగ్రీలో అన్ని కోర్సులకూ కంప్యూటర్‌ ఒక పేపరుగా ఉంటుంది కాబట్టి, కంప్యూటర్‌ ప్రిపరేషన్‌ సులువే.

మార్కెటింగ్‌ ఆప్టిట్యూడ్‌, కంప్యూటర్‌ నాలెడ్జి విభాగంలో క్వాలిక్యులేషన్స్‌ వంటి సమయం ఎక్కువ పట్టే అంశాలు ఉండవు. కాబట్టి, తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు స్కోరు చేయడానికి అవకాశం ఉంది.
తప్పు సమాధానాలకు నెగిటివ్‌ మార్కులు ఉన్నాయి. ప్రతి తప్పు సమాధానానికీ 1/4 మార్కు కట్‌ అవుతుంది. సమాధానాలను గుర్తించేటప్పుడు వూహించి లేదా లాటరీ పద్ధతిలో సమాధానాలు గుర్తించడం సరైన పద్ధతి కాదు. కచ్చితమైన సమాధానాన్ని ధ్రువపర్చుకొని మాత్రమే ్చ్మ్మ్ఠ్ఝ్ప్మ చేయడం మంచిది.

ప్రిపరేషన్‌కు దాదాపుగా 3 నెలల సమయం ఉంది. కాబట్టి, చక్కని ప్రణాళికతో ప్రిపేర్‌ అవ్వొచ్చు.

చి ముందుగా క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, రీజనింగ్‌ సబ్జెక్టుల ప్రాక్టీసు పేపర్లు వీలైనన్ని ఎక్కువగా సాధన చేయాలి.
చి మార్కెటింగ్‌ మౌలిక అంశాలు( ఫండమెంటల్స్‌) ముందుగా ప్రిపేర్‌ అయి తర్వాత ప్రస్తుత మార్కెటింగ్‌ అంశాలపై పరిశీలనాత్మక పరిజ్ఞానం (Observation of present marketing conditions) పెంపొందించుకొని చక్కటి నోట్సు తయారు చేసుకోవాలి.
చి జనరల్‌ అవేర్‌నెస్‌కు సుమారుగా 6 నెలల కరెంట్‌ అఫైర్స్‌ ప్రిపేర్‌ అయి ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసుకుంటూ ఉండాలి. ప్రతిరోజూ క్రమం తప్పకుండా పేపర్‌ చదవడం అవసరం.
చి ఇంగ్లిష్‌ సబ్జెక్టుకు గ్రామర్‌, ఒకాబులరీ ప్రిపరేషన్‌పై దృష్టి పెట్టాలి.

అభ్యర్థి ఆత్మవిశ్వాసం, నిజాయితీ, ఆశావహ దృక్పథంలాంటి లక్షణాల పరిశీలనకు ఉద్దేశించిన వ్యక్తిత్వ పరీక్షే ఇంటర్వ్యూ.

ఎక్కువ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ వచ్చినందున అభ్యర్థులు ప్రణాళికాబద్ధమైన ప్రిపరేషన్‌తో ఎస్‌బీఐ ఉద్యోగం సాధించవచ్చు.
3 నెలల ప్రిపరేషన్‌ ప్రణాళిక
జి.ఎస్‌. గిరిధర్‌
డైరెక్టర్‌ ళితిదిని ఇన్‌స్టిట్యూట్‌
ఎస్‌బీఐ నుంచి వచ్చిన భారీ నోటిఫికేషన్‌ నిస్సందేహంగా నిరుద్యోగులకు వరం లాంటిది. ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకోవటానికి శక్తివంచన లేకుండా శ్రమించాలి. పరీక్ష కోసం ఎలా సన్నద్ధం కావాలో, ఏ విధంగా సాధన చేస్తే విజయం వరిస్తుందో చూద్దాం.
‘చక్కని ప్రారంభంతో సగం పని పూర్తయినట్లే'నని నానుడి. కాబట్టి, మరో 3 నెలల సమయంలో జరగబోయే ఎస్‌బీఐ క్లరికల్‌ పరీక్ష రాసేవారు ఏవిధంగా సన్నద్ధంగా ఉండాలో ముందే ఒక అవగాహనకు రావాలి.

మొదట పరీక్ష విధానం గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ఎన్ని సబ్జెక్టులుంటాయి? వాటి సిలబస్‌ ఏమిటి? ఏ సబ్జెక్టుకు ఎంత సమయం కేటాయించాలి? లాంటి వాటిపై అవగాహన పెంచుకోవాలి.

చిపరీక్షలో ఉండే ఐదు సబ్జెక్టుల్లో మొత్తం సిలబస్‌ కవరయ్యేలా పుస్తకాలు, స్టడీ మెటీరియల్‌ సేకరించాలి. ఇంతకుముందు పరీక్ష రాసిన అభ్యర్థుల, నిపుణుల సలహాలు తీసుకుంటే మంచిది.
చిరోజుకు కనీసం 5-6 గంటలకు తక్కువ కాకుండా సమయం కేటాయించుకోవాలి. ప్రతి రోజూ అన్ని సబ్జెక్టులు కవర్‌ అయ్యేవిధంగా చూసుకోవాలి.
చి అన్నింటికీ ఒకేవిధమైన సమయాన్ని కాకుండా దాని క్లిష్టతను బట్టి కేటాయించడం సరైనది. Quantitative Aptitude, (Q.A.) Reasoning అధిక వ్యవధి పడుతుంది. కాబట్టి వాటికి ఎక్కువ సమయం కేటాయించాలి.

ప్రాథమికాంశాలపై పట్టు
అన్ని సబ్జెక్టుల సిలబస్‌ను పరిశీలించి దాని ప్రకారం ఆయా సబ్జెక్టుల్లో ఉండే అంశాలపై మంచి పట్టు సాధించాలి. శీ.తి.లో ఉండే అంకగణితం తిri్మ్త్ఝ్ఠ్మi్ఞలోని ప్రతి అంశంపై బాగా అవగాహన ఉండాలి.

చి గత ప్రశ్నపత్రాల్లో ఎక్కువ ప్రశ్నలు ఏ అంశాల నుంచి వస్తున్నాయో గమనించి, వాటిపై ఎక్కువ శ్రద్ద వహించాలి.
చి ఈ మధ్య కాలంలోని పరీక్ష పత్రాలను గమనిస్తే... ప్రస్తారాలు- సంయోగాలు (పర్మ్యుటేషన్స్‌ అండ్‌ కాంబినేషన్స్‌) నుంచి ప్రశ్నలు అధికంగా వస్తున్నాయి.
చి పరీక్షకు మూడు నెలల సమయం ఉంది కాబట్టి, అంకగణితంలోని అన్ని అంశాలలోని ప్రతి ప్రశ్నను కనీసం నాలుగైదు సార్లు సాధించేలా చూసుకోవాలి.
లెక్కలంటే బెరుకా?
గణితాన్ని ఇంటర్లో, డిగ్రీలో సబ్జెక్టుగా చదవని విద్యార్థులు లెక్కలంటే గాభరా పడాల్సిన పనిలేదు. ముందుగా తేలికపాటి ప్రశ్నలను సాధిస్తూ సన్నద్ధం కావాలి. తర్వాత క్లిష్టతను పెంచుకుంటూ వెళ్లాలి. వీరు మిగిలిన వారికంటే కంటే ఎక్కువ సమయం సాధనకు కేటాయించాలి. రోజూ కనీసం 4-5 గంటలైనా లెక్కలు అభ్యాసం చేయాలి.

చి శీతిప్రాక్టీస్‌ చేసేప్పుడు సాధారణ పద్ధతిలో కాకుండా ఇంకా సులభంగా చేయెచ్చునేమో గమనించాలి. దీంతో షార్ట్‌కట్‌ పద్ధతులు తెలుస్తాయి. కొన్ని ప్రశ్నలను సాధించకుండానే ఆప్షన్స్‌ను చూసే సరైన జవాబు గుర్తించవచ్చు. ప్రశ్నలో కండిషన్స్‌ ఇస్తే వాటికి ఈ పద్ధతి వర్తిస్తుంది. కొన్ని తరహా ప్రశ్నలు పరీక్షలో తరచుగా వస్తుంటాయి. వాటికి సూత్రాలు గుర్తుంచుకుంటే సరిపోతుంది.

అన్నింట్లోనూ...
చిఎస్‌బీఐ పరీక్షకున్న 3 నెలల సమయానికి ఒక టైమ్‌ టేబుల్‌ను రూపొందించుకోవాలి. ప్రతిరోజూ అన్ని సబ్జెక్టులు కవర్‌ అయ్యేలా ప్రణాళిక వేసుకోవాలి. అన్నింటికిమించి ఆ టైమ్‌ టేబుల్‌కు కట్టుబడి ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాక్టీస్‌ ఆపకూడదు.
చి బ్యాంకు పరీక్షలో విజయం సాధించాలంటే అన్ని సబ్జెక్టుల్లోనూ విడివిడిగా ఉత్తీర్ణులవ్వాల్సి ఉంటుంది. కాబట్టి, అన్నింటికీ ప్రాధాన్యమివ్వాలి. సాధ్యమైనన్ని నమూనా పరీక్షలు (మాక్‌ టెస్ట్‌లు) చేయాలి. సమయం చూసుకుంటూ సాధన చేయాలి.
చి శీతి పేపర్‌ను 30 నిమిషాల్లో 40 ప్రశ్నలు సాధించేలా తయారవ్వాలి. క్లరికల్‌ పరీక్షలో చాలావరకూ ప్రాథమికాంశాల మీదనే ప్రశ్నలుంటాయి కాబట్టి ఆందోళన అనవసరం.
చి జనరల్‌ అవేర్‌నెస్‌ కోసం గత ఆరునెలల వర్తమాన అంశాల(కరెంట్‌ ఎఫైర్స్‌)పై అవగాహన ఉండాలి. ఇప్పటినుంచి పరీక్ష తేదీ వరకు ప్రతిరోజూ వార్తాపత్రికలను (ఈనాడు, ఎకనామిక్స్‌ టైమ్స్‌) కనీసం 2 గంటల పాటు పరీక్ష కోణంలో క్షుణ్ణంగా చదవాలి. ఎకానమీ వార్తలకు ప్రాధాన్యమివ్వాలి.
చి మార్కెటింగ్‌, కంప్యూటర్స్‌ సబ్జెక్టులపై చాలా పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ఎంఎస్‌ ఆఫీస్‌ గురించి బాగా తెలిసి ఉండాలి. వాటి నుంచి ప్రశ్నలుంటాయి.
చి పరీక్ష సమయం వరకు అన్ని సబ్జెక్టులను కనీసం 2-3 సార్లు పునశ్చరణ అయ్యేలా చూసుకోవాలి. Mental calculations, Speed Maths బాగా ప్రాక్టీస్‌ చేయాలి.
మాదిరి ప్రశ్నపత్రాలను చేస్తున్నప్పుడు సబ్జెక్టుల క్లిష్టతను బట్టి సమయాన్ని కేటాయించుకోవాలి. తేలికపాటి ప్రశ్నలను ముందుగా చేసి ఆ తర్వాత కష్టమైన ప్రశ్నలను సాధించేలా సాధన చేస్తే పరీక్షలో ఎక్కువ ప్రశ్నలు సాధించే వీలుంటుంది.

90 శాతం చేస్తేనే...
200 ప్రశ్నలుండే మాదిరి ప్రశ్నపత్రాల్లో 170-180 ప్రశ్నలను 90 శాతం ్చ్ఞ్ఞ్యr్చ్ఞ్వతో సాధించగలగాలి. అలా చేయగల్గినప్పుడే పరీక్షకు సరైనవిధంగా సిద్ధమైనట్లు. లేదంటే ప్రాక్టీస్‌ మరింత ముమ్మరం చేయాలి.

చి మాదిరి ప్రశ్నపత్రాలను చేస్తున్నప్పుడు సబ్జెక్టుల క్లిష్టతను బట్టి సమయాన్ని కేటాయించుకోవాలి. తేలికపాటి ప్రశ్నలను ముందుగా చేసి ఆ తర్వాత కష్టమైన ప్రశ్నలను సాధించేలా సాధన చేస్తే పరీక్షలో ఎక్కువ ప్రశ్నలు సాధించే వీలుంటుంది.

పరీక్ష గదిలో...
ముందుగా జనరల్‌ అవేర్‌నెస్‌, మార్కెటింగ్‌, కంప్యూటర్‌ సబ్జెక్టులు, ఆ తర్వాత ఇంగ్లిష్‌ పూర్తి చేసి; మిగిలిన సమయంలో శీ.తి., ళ్ఠ్చ్బ్న్థిi్థ్ణ సబ్జెక్టులను చేస్తే సమయం కలిసొస్తుంది.

చి సాధారణంగా లెక్కలు చేస్తున్నప్పుడు ఎంత సమయం గడుస్తుందో తెలియదు. మిగిలిన సబ్జెక్టులపై ఆ ప్రభావం పడకుండా ఉండాలంటే లెక్కలను చివరలో చేయడం మంచిది.
చి ఏదైనా ప్రశ్నకు జవాబు వెంటనే స్ఫురణకు రాకపోతే దానిని వదిలేసి వేరొక ప్రశ్నకు వెళ్లడం మంచిది.
చి అన్ని ప్రశ్నలూ పూర్తిచేయలేకపోయామని ఆందోళన వద్దు. కానీ అన్ని సబ్జెక్టులలో కనీసం 80-90 శాతం ప్రశ్నలు చేసేలా జాగ్రత్త పడాలి.
ఈ సూచనలన్నింటినీ పాటిస్తే విజయం తప్పక లభిస్తుంది.

శ్రీవారి నగల వివరాలివ్వండి


తితిదేకు హైకోర్టు ఆదేశం
హైదరాబాద్‌, తిరుపతి, న్యూస్‌టుడే: తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి ఆధ్వర్యంలో ఉన్న అన్ని దేవాలయాల్లోని నగల వివరాలను అందజేయాలని సోమవారం హైకోర్టు తితిదేని ఆదేశించింది. గతంలో ఉన్న జాబితాకు ప్రస్తుతం సేకరించినదానికి తేడాలేమైనా ఉంటే కోర్టు దృష్టికి తీసుకురావాలంది. డాలర్లు అదృశ్యమైన నేపథ్యంలో స్వామివారి ఆభరణాలకు రక్షణ కల్పించాలంటూ నెల్లూరు కాంగ్రెస్‌ నేత బెజవాడ గోవిందరెడ్డి గత ఏడాది ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ గోడా రఘురాం, జస్టిస్‌ రమేష్‌రంగనాథన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. డాలర్ల అదృశ్యం తదితర అంశాలపై విచారణ చేపట్టడానికి ప్రభుత్వం ఇప్పటికే ఏకసభ్య కమిషన్‌ను నియమించిందని, ఈ నేపథ్యంలో పిటిషన్‌పై విచారణను ముగించాలని తితిదే తరఫు న్యాయవాది కోరారు. ఈ వాదనను పిటిషనర్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది ఎస్‌.రామచంద్రరావు విభేదించారు. ఏడాదిగా పిటిషన్‌ పెండింగ్‌లో ఉండగా కమిషన్‌ ఏర్పాటు చేశామంటూ విచారణను ముగించడం సరికాదన్నారు. విజయనగర కాలం నుంచి స్వామివారికి నగలు ఉన్నాయని, ప్రస్తుతం వాటికి భద్రత కొరవడిందని తెలిపారు. స్వామివారి డాలర్లు అదృశ్యమయ్యాయని, మరి నగల పరిస్థితి ఏమిటోనని అనుమానాలు వ్యక్తంచేశారు. ఖజానాకు సంబంధించి తాళాలు రెండూ ఒకరి వద్దే ఉంటున్నాయని చెప్పారు. వాదనలను విన్న హైకోర్టు స్వామివారి నగల వివరాలను తెలియజేయాలని ఆదేశించింది. ప్రతివాదులైన తితిదే, రాష్ట్ర ప్రభుత్వాలను కౌంటర్లు దాఖలు చేయాలంటూ విచారణను మూడువారాలకు వాయిదా వేసింది.

బంగారు కొండ మరి
వజ్రకిరీటధారి వెంకన్న ఆలయ బొక్కసంలో మూలుగుతున్న ఆభరణాల విలువెంతో ఇప్పటికీ వెలకట్టలేకపోతున్నారు. శ్రీవారికి 12వశతాబ్ధి నుంచే కానుకల వెల్లువ ప్రారంభమైంది. 1509-1530 మధ్య కాలంలో దేవదేవుణ్ని శ్రీకృష్ణదేవరాయలు ఏడుసార్లు సందర్శించి స్వామివారి భాండాగారాన్ని స్వర్ణమయం చేశాడు. 10.02.1513లో కెంపులు, పచ్చలు, వజ్రాలు, నీలాలు, మాణిక్యాలు, వైఢూర్యాలు, గోమేధికాలతో పొదిగిన వజ్రకిరీటాన్ని సమర్పించారు. 02.05.1513న నవరత్నఖచిత ఉడుధార, స్వర్ణఖడ్గం, భుజకీర్తులు, 30 తీగల పతకం ఆయన అందించారు. తంజావూరు రాజు పాండ్యన్‌ కిరీటం సమర్పించారు. మైసూరు మహారాజు సహా పలువురు విలువైన కానుకలు అందించారు. ఇందులో 108 బంగారు పుష్పాలు, 32 కిలోల సహస్రనామహారం, నాలుగు కిలోల చతురు్భజ లక్ష్మీహారం, 7 కిలోల రత్నాల మకరకంఠి, 13.6 కిలోల నవరత్న కిరీటం ఉన్నాయి. దీంతోపాటు 500 గ్రాముల అరుదైన గరుడమేరు పచ్చ ఆభరణం ఉంది. మొత్తం మీద మూలవిరాట్‌కు ఎనిమిది కిరీటాలు, ఉత్సవ విగ్రహాలకు ఏడు కిరీటాలున్నాయి. దీంతోపాటు రతన్‌టాటా, అంబానీలు, విజయ్‌మాల్యా, గోయెంకా తదితర ప్రముఖులతో పాటు అజ్ఞాత భక్తులు సమర్పించే కానుకలకు అంతేలేదు. వెంకన్నకు 1940లో వజ్రకిరీటం, 1954లో వజ్రాలహారం, 1972లో వజ్రాల శంఖు, చక్రాలు, కర్ణపత్రాలు, 1974లో కఠిహస్తం, 1986లో రూ.5 కోట్ల విలువైన వజ్రాల కిరీటాన్ని తితిదే తయారు చేయించింది.

అమూల్య విలువకు గోప్యత
శ్రీవారి ఆభరణాలకు తితిదే 19 రికార్డులు నిర్వహిస్తున్నా, వీటి ఆధారంగా మదింపు చేసేందుకు నిపుణులు వెనకడుగు వేస్తున్నారు. ఏళ్లు గడుస్తున్నా వీటి విషయం గోప్యంగా ఉంచుతూ వస్తున్నారు. అయితే గత ఏడాది నిర్వహించిన అమృతోత్సవాల సందర్భంగా శ్రీవారి ఆభరణాల విలువ రూ.32 వేల కోట్లు అంటూ వెల్లడైంది. కానీ, విశ్లేషకుల అంచనా ప్రకారం దేవదేవుని ఆభరణాల బరువు మొత్తం 11.5 టన్నులు. వీటి విలువ రూ.50 వేల కోట్లకు పైగా ఉన్నట్లు తేల్చుతున్నారు. ఇలా ఎవరికి వారు విలువ నిర్ధరించడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. శ్రీకృష్ణదేవరాయల కాలం నుంచి ఇప్పటివరకు ఏనాడూ తితిదే వీటి విలువ గణించకపోవడంపై వివాదం నెలకొంది. కోర్టు ఆదేశాల మేరకు తాము ఆభరణాల జాబితా నివేదికను గడువులోగా ఇస్తామని తితిదే ఛైర్మన్‌ ఆదికేశవులునాయుడు చెప్పారు.

తిరుమలలో 40 రొజులకు


తిరుమల, న్యూస్‌టుడే: వర్షాభావ పరిస్థితులతో తిరుమలలో జలవనరులు అడుగంటిపోతున్నాయి. ప్రస్తుతం అకాశగంగ పూర్తిగా ఎండిపోయింది. గోగర్భం డ్యాం కూడా వట్టిపోయే దశకు చేరుకుంది. పాపవినాశనం డ్యాంలో మాత్రం కొంత నీరు ఉంది. తిరుమలలో ప్రస్తుతం రోజుకు 30 నుంచి 35 లక్షల గ్యాలన్ల నీరు వినియోగం అవుతోంది. పాపవినాశనం డ్యాంలో 2,260 లక్షలు, గోగర్భంలో 335 లక్షల గ్యాలన్ల నీరు అందుబాటులో ఉంది. ఈ మొత్తం నీటిలో 908 లక్షల గ్యాలన్లు అవిరవుతుందని అధికారులు అంచనా వేశారు. ఇక మిగిలే నీరు 1,687 లక్షల గ్యాలన్లు మాత్రమే అందుబాటులో ఉంటుంది. పాంచజన్యం, సన్నిధానం అతిధి భవనాలు భక్తులకు అందుబాటులోకి తీసుకురావడానికి తితిదే చర్యలు చేపట్టింది. దీంతో రోజు వారీగా నీటి వినియోగం 40 లక్షల గ్యాలన్లకు చేరుకుంటుందని అంచనా. ఫలితంగా అందుబాటులో ఉన్న 1,687 లక్షల గ్యాలన్ల నీరు 40 రోజుల అవసరాలకు మాత్రమే సరిపోనుంది. వచ్చే నెలలో శ్రీవారికి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. దీంతో నీటి ఇబ్బందులు తీవ్రంగానే ఉండే అవకాశాలు కన్పిస్తున్నాయి.

చెన్నై శ్రీవారికి 108 స్వర్ణ కమలాలు


చెన్నై, న్యూస్‌టుడే: చెన్నైలోని తిరుమల-తిరుపతి దేవస్థానం సమాచార కేంద్రంలోని శ్రీవారికి ఓ భక్తుడు 108 స్వర్ణ కమలాలు బహుకరించారు. గ్రానైట్‌ వ్యాపారి జేసీ నాయుడు వీటిని రూ.20 లక్షల వ్యయంతో చేయించారు. ఒక్కో బంగారు పుష్పం తయారీకి పది గ్రాముల బంగారం ఉపయోగించారు. మొత్తం కేజీకిపైగా బంగారు వాడారు. వీటిని స్వామివారి పాదాల ముందు అలకరించడానికి వెండి పీఠాన్ని కూడా తయారు చేసి బహుకరించారు. ‘జీఆర్‌టీ జ్యూవెలరీస్‌' ఈ పుష్పాలను తయారు చేసింది. రెండు రోజుల క్రితం ఈ పుష్పాలు తితిదే సమాచారం కేంద్రానికి చేరాయి. వీటిని వారం రోజుల్లో శుభముహూర్తాన స్వామివారికి సమర్పిస్తారు.
వజ్రకటి హస్తాలు: సమాచార కేంద్రంలోని శ్రీవారికి త్వరలోనే ఓ భక్తుడు వజ్రకచిత కటిహస్తాలను బహుకరించనున్నారు. కేంద్ర మంత్రి జగద్రక్షకన్‌ కుటుంబీకులు సుమారు రూ.50 లక్షల వ్యయంతో ఈ కటిహస్తాలను రూపొందించి బహుకరించడానికి అంగీకరించినట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. సింగపూరుకు చెందిన ఓ పారిశ్రామికవేత్త ఇక్కడ స్వామి వారికి రూ.22 లక్షల వ్యయంతో స్వర్ణకాసుల హారాన్ని బహుకరించనున్నారు.

మగధీర వార్తలకెక్కింది

మచిలీపట్నం, న్యూస్‌టుడే: న్యాయవాదులు, తల్లిదండ్రుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతీసేలా ఉన్న మగధీర చిత్రం ప్రదర్శనను తక్షణమే నిలిపివేయాలంటూ కృష్ణా జిల్లా మచిలీపట్నం బార్‌ అసోసియేషన్‌ మాజీ అధ్యక్ష్యుడు లంకిశెట్టి బాలాజీ జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో బుధవారం పిటిషన్‌ దాఖలు చేశారు. చిత్ర కథానాయకుడు కొణిదెల రాంచరణ్‌తేజ, దర్శకుడు రాజమౌళి, నిర్మాత అల్లు అరవింద్‌, స్థానికంగా చిత్ర ప్రదర్శన చేస్తున్న రెండు సినిమా హాళ్ల యజమానులను ఆయన ప్రతివాదులుగా పేర్కొన్నారు. వృత్తిధర్మం ప్రకారం కేసు వాదించడానికి అంగీకరించిన న్యాయవాదిని కిరాతకంగా చంపడాన్ని చూపిస్తున్నందున న్యాయవాదుల జీవితాలకు అభద్రత ఏర్పడే ప్రమాదం ఉందన్నారు. అలాగే ప్రియురాలి కోసం కన్న తండ్రినే కొడుకు కర్కశంగా హతమార్చడం కూడా నేటి యువతరానికి చెడు సందేశాన్ని ఇచ్చేలా ఉందని అభిప్రాయపడ్డారు. తమ పిటిషన్ను న్యాయసేవాధికార సంస్థ ఈ నెల 18కి వాయిదా వేసిందని ఆయన తెలిపారు.

ఇది ఇలా వుండగా ఈ చిత్రం మరోమారు వార్తలకెక్కింది. ఇప్పటికే సంచలన విజయంతో తెలుగు చిత్రపరిశ్రమలో హాట్ టాపిక్‌గా ఈ చిత్రం మారింది. అయితే, ఈ చిత్రంలోని ఒక పాట ప్రస్తుతం వివాదాస్పదమైంది.

తన అనుమతి లేకుండా ‘ఏం పిల్లడో ఎల్దమొస్తవా’ అనే పాటను వాడుకున్నారని ప్రముఖ రచయిత, ప్రజా గాయకుడు వంగపండు ఆరోపించారు.

ఈ పాట ఎంతోమందిని ఉద్యమబాటవైపు నడిపించిందని గుర్తు చేశారు. ఓ మంచి ఉద్యమ స్ఫూర్తి కలిగిన పాటను అసభ్యకరమైన దృశ్యాలను చూపిస్తూ పాటకు ఉన్న విలువను గంగలో కలిపారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పాటను చిత్ర సన్నివేశంలో చూసిన ఓ కుర్రాడు ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

మంచి సందేశంలో ఉపయోగించకుండా అశ్లీల దృశ్యాలు చూపిస్తూ ఉపయోగించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. దీనిపై క్షమాపణ చెప్పకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని వంగపండు హెచ్చరించారు. ఆ పాటను ఆ సన్నివేశం నుంచి తక్షణం తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.

total 616 swine flu cases in India

New Delhi, Aug 6 (IANS) The capital reported 11 cases of swine flu and Pune eight taking the total number of infected people in the country to 616 Thursday amid panic in the two cities for the second consecutive day with hundreds flocking testing centres for screening.

Nineteen laboratory-confirmed cases have been reported today: Delhi (11) and Pune (8), the health ministry said in a statement.

Of the 616 positive cases, 487 have been discharged so far. One patient - Reeda Shaikh, a 14-year-old girl from Pune - died Monday. The rest remain admitted to the identified health facilities, the ministry said.

Out of the 11 cases in Delhi, 10 are contact cases of previously reported positive cases. They have no travel history. The 11th case is a 25-year-old man who arrived here from Chicago July 28. He reported with symptoms Wednesday and was found positive with the influenza A(H1N1) virus.

Out of the eight new cases in Pune, seven are indigenous and the eighth case is a 45-year-old woman who travelled from Frankfurt via Mumbai.

Meanwhile, hundreds of people in Pune and Delhi rushed to designated hospitals for a check-up. While around 800 'voluntary patients' went to the Naidu Hospital in Pune, at least 265 patients went for screening at the Ram Manohar Lohia (RML) Hospital in the capital.

'There is fear and people will come to the hospital. But it is the duty of doctors in public service to give their best for the betterment of the country. My doctors are fully committed to screen and counsel whoever comes in,' S.K. Sharma, medical officer of RML, told IANS.

'There was no chaos or mismanagement. Our screening centres are open round the clock to help anyone,' Sharma added after taking care of over 260 visitors in his hospital.

వర్మ "అడవి" హోర్డింగుపై ఉరి వేసుకుని


ముంబయిలోని జార్గాన్ ఫ్లై ఓవర్ వద్ద సోమవారం అడవి చిత్రం హోర్డింగును చూసిన జనం ఠారెత్తిపోయారు. ఆ హోర్డింగుపై రక్తపు మరకలతో ఉరితో వేలాడుతున్న మానవ శరీరాన్ని చూసి బెంబేలెత్తిపోయారు. ఈ వార్త ముంబయిలో దావానంలా వ్యాపించడంతో ఆ హోర్డింగు వద్ద భారీ సంఖ్యలో జనం గుమిగూడారు. పోలీసు కంట్రోలు రూముకు ఫోను చేసి, విషయాన్ని చేరవేశారు. పోలీసులు రంగప్రవేశం చేసి శరీరాన్ని కిందికి దింపి చూస్తే.. అసలు నిజం ఏమిటో బయటపడింది. వివరాలలోకి వెళితే...

అడవి చిత్రం విడుదల తేదీ దగ్గరయ్యేకొద్దీ చిత్ర దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రేక్షకులలో ఉత్కంఠను రేకిత్తించే మార్గాలను అనుసరిస్తున్నారు. మొన్నటికి మొన్న "రణ్" చిత్రంలో జనగణమన "రణ్" అధినాయక జయహే అంటూ జాతీయగీతంలో పలు వివాదస్పద పదాలను చొప్పించిన వర్మ తాజాగా ముంబయిలో మరో అలజడిని సృష్టించారు.

అడవి పబ్లిసిటీని వెరైటీగా చేయాలనుకున్న వర్మ ముంబయిలోని జార్గాన్ ఫ్లై ఓవర్ వద్ద చిత్రం తాలూకు పెద్ద హోర్గింగ్‌ను ఏర్పాటు చేశారు. సహజంగా తన సినీ ప్రమోషన్లలో హాట్ డ్రెస్సుల్లో ఉన్న హీరోయిన్ల శరీర ప్రదర్శను ఉంటుంది. కానీ దీనికి భిన్నంగా హోర్డింగ్‌పై మనిషి డమ్మీ శరీరాన్ని ఉరి వేసుకున్నట్లుగా వేలాడదీయించాడు. ఆదివారం బాగా పొద్దుపోయిన తర్వాత ఈ పబ్లిసిటీ తాలూకు కార్యక్రమాన్ని ముగించాడు.

ఉదయాన్నే ఆ దారినే ఆఫీసుకు వెళ్లేవారు, ఇతర వ్యాపారులు, ప్రజలు హోర్డింగుకు ఉరివేసుకుని వేలాడుతున్నది నిజమైన మనిషేమోనని ఆందోళన చెందారు. హోర్డింగుపై ఉరితో వేలాడుతున్న మనిషి, అతని శరీరంపై ఉన్న రక్తపు మరకలు చూసి భయభ్రాంతులయ్యారు. చివరికి పోలీసులు రంగ ప్రవేశం చేసి అడవి హోర్డింగుపై వేలాడుతున్న సదరు శరీరాన్ని కిందకు దింపి పరీక్షగా చూస్తే.. అది డమ్మీ మనిషని తేలింది. పోలీసులు ఆ డమ్మీ మనిషిని స్టేషనుకు తీసుకెళ్లారు. వర్మ అడవికి కావలసిన పబ్లిసిటీ వచ్చేసింది.

రక్షాబంధన్





శ్రావణమాసంలో వచ్చే పూర్ణిమను "శ్రావణపూర్ణిమ" లేక "జంధ్యాల పూర్ణిమ" మరియు "రాఖీ" లేక "రక్షాబంధన్" పండుగ అని పిలుస్తూ ఉంటారు.

అన్నాచెలెళ్లు లేదా అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండుగను గడుపుకుంటారు. ఉత్తర, పశ్చిమ భారతదేశాలలో వైభవంగా జరుపుకునే ఈ పండుగను ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు.

ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో వచ్చే ఈ పండుగ రోజున జంధ్యాలు ధరించే వారు నూతన జంధ్యాలు ధరిస్తారు. ఇదే రోజున బ్రాహ్మణులు నూతన యజ్ఞోపవీతధారణలు చేసి విద్యార్ధులకు వేదపఠనం ప్రారంభిస్తారు.

వేదపండితులు వేదాలను వల్లెవేయడం అంటే.. ఆ వృత్తిని ప్రారంభించడం, ప్రారంభఋక్కును-చివరిఋక్కును ఇదే రోజున పఠించడం చేస్తారు.

ఈ విధంగా కాలక్రమంలో "రక్షాబంధన్ లేక రాఖీ" పండుగగా ప్రాచుర్యం పొందిన శ్రావణ పూర్ణిమ నాడు ఈ దిగువ మంత్రాన్ని పఠిస్తూ సోదరి-సోదరునకు, భార్య-భర్తకు ఈ రక్షాబంధనన కడుతూఉంటారు. పూర్వం యుద్ధానికి వెళ్ళే వీరునికి విజయం ప్రాప్తించాలని ఆశిస్తూ ఈ రక్షాబంధననను కట్టే వారని పురాణాలు చెబుతున్నాయి.

"యేన బద్ధో బలీరాజా దానవేంద్రో మహాబలః
తేన త్వామభి బధ్నామి రక్షమాచల మాచల"

శ్రీ మహావిష్ణువు శక్తిచే మహాబలుడు అయిన బలిచక్రవర్తిని బంధించినట్లుగా ఓ రక్షాబంధనమా! నీవు చలించక వీనికి రక్షణ కల్పించుము అని మంత్రార్థం.

ఇక.. రక్షాబంధన్ ఎలా ప్రారంభమైనది అంటే..? పూర్వం దేవతలకు - రాక్షసులకు మధ్య పుష్కరకాలం యుద్ధము సాగింది. ఆ యుద్ధములో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు నిర్వీర్యుడై తన పరివారమంతటిని కూడగట్టుకుని 'అమరావతి' లో తలదాచుకుంటాడు.

అట్టి భర్తనిస్సహాయతను గమనించిన ఇంద్రాణి 'శచీదేవి' తగు తరుణోపాయమునకై ఆలోచిస్తూ ఉన్న సమయాన ఆ రాక్షసరాజు చివరకు 'అమరావతి'ని కూడా దిగ్భంధన చేయబోతున్నాడు అని గ్రహించి, భర్త దేవేంద్రునకు 'సమరోత్సాహము' పురికొలిపినది. సరిగా ఆరోజు "శ్రావణ పూర్ణిమ" అగుటచేత 'పార్వతీ పరమేశ్వరులను', లక్ష్మీ నారాయణులను పూజించి ఆ పూజించబడిన "రక్షా" దేవేంద్రుని చేతికి కడుతుంది.

అది గమనించిన దేవతలందరు వారు పూజించిన రక్షలు తెచ్చి ఇంద్రునకు కట్టి ఇంద్రుని విజయయాత్రకు అండగా నిలచి, తిరిగి 'త్రిలోకాధిపత్యాన్ని' పొందారు. ఆనాడు శచీదేవి ప్రారంభించిన 'ఆ రక్షాబంధనోత్సవం' నేడు అది 'రాఖీ' పండుగగా ఆచారమైందని పురాణాలు చెబుతున్నాయి.

ఇంకా రాఖీకి గల పవిత్రత ఏమిటంటే..? భార్య- భర్తకు, సోదరి- సోదరులకు కట్టే రక్షాబంధన్ ద్వారా వారు వారు తలపెట్టే కార్యములు విజయవంతమై సుఖసంపదలు కలగాలని, వారి మాన మర్యాదలకు సోదరుడు/భర్త బాసటగా నిలవాలని ఆకాంక్షించే సత్ సంప్రదాయమే ఈ 'రాఖీ'. అలా రాఖీలు కట్టించుకున్న భర్తలు, సోదరులు వారికి నూతన వస్త్రాలు, చిరుకానుకలు సమర్పించి, అందరు కలసి చక్కని విందు సేవిస్తారు.

ఇదిలా ఉంటే... పూర్వం విదేశీయులు మనదేశాన్ని పాలిస్తున్న రోజులలో మొగాలాయీల దుర్నీతికి దురంతాలకు ఏమాత్రం అడ్డూ అపూ అనేది లేకుండా పోయేది. హిందూ జాతి వారి కబంధహస్తాలలో నలిగిపోయేది. స్త్రీలు వారి మాన ప్రాణరక్షణకై వీరులైన యోధులను గుర్తించి వారికి 'రక్షాబంధనం' కట్టి వారు చూసే సోదర భావముతో, రక్షణ పొందేవారు.

ఒకసారి 'రాణి కర్ణావతి' శత్రువులు తన దుర్గాన్ని ముట్టడించినప్పుడు 'ఢిల్లీపాదుషాకు' రాఖీ పంపగా ఆమెను సోదరిగా భావించి శత్రువులను తరిమికొట్టి ఆ సోదరి ఇంట పాదుషా భగినీ హస్తభోజనంచేసి, కానుకలు సమర్పించినట్లు గాథలు ఉన్నాయి.

అట్టి శ్రావణ పూర్ణిమ లేక జంధ్యాల పూర్ణిమ, మరియు రాఖీ లేక రక్షాబంధన్ పండుగను అమితానందంతో జరుపుకుందాం. మరి సోదరీ, సోదరులకు రాఖీ శుభాకాంక్షలు..

శ్రావణ మంగళవారం "మంగళ గౌరీవ్రతం"



పూర్వం కృతయుగంలో దేవతలు రాక్షసులు కలిసి అమృతం కోసం క్షీరసాగరమధనం చేసే సమయాన. అమృతానికి ముందు అగ్నిజ్వాలలు కక్కుతూ కాలకూట విషయం పుట్టుకొచ్చింది.

దానిని చూసి భయకంపితులైన దేవదానవులు పరమేశ్వరుని శరణుజొచ్చారు. ఆ సమయాన పరమేశ్వరుడు మందహాసముతో చిరునవ్వు నవ్వి.. ఇప్పుడు నేనేమి చెయ్యను? అన్నట్లు పార్వతి వైపు చూచాడు.

"మ్రింగెడు వాడు విభుండని మ్రింగెడిది గరళమనియు మేలని ప్రజకున్
మ్రింగుమనే సర్వమంగళ మంగళ సూత్రమును నెంతమది నమ్మినదో"

ఆ సర్వమంగళ స్వరూపిణియై జగన్మాత, భర్తచూపులోని ఆంతర్యమేమిటో గ్రహించింది. దేవతులైనా, దానవులైనా, మానవులైనా, మనభక్తులే కదా! మన బిడ్డలకు ఆపద కలిగినప్పుడు మనము కాక వేరెవరు రక్షిస్తారు? అని భావించి నిరంతరం స్త్రీల సౌభాగ్య సంపదను కాపాడే ఆ సర్వమంగళ స్వరూపిణి తన మాంగల్య సౌభాగ్యముపై ప్రగాఢ విశ్వాసముంచి, లోకవినాశానికి కారణభూతమైన ఆ భయంకర కాలకూట విషాన్ని తన భర్త మింగేందుకు అనుమతి ఇచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. అట్టి కరుణాంతరమూర్తి పార్వతీదేవిని "శ్రీ లలితా సహస్రనామ పారాయణ" ప్రారంభంలోనే ఇలా ధ్యానిస్తారు.

"అరుణాం కరుణా తరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపామ్
అణిమాదిభి రావృతాం వయూఖై రహమిత్యేవ విభావయే భవానీమ్."

అట్టి సర్వమంగళ స్వరపిణి అయిన భవానీ మాతను కొత్తగా పెళ్లైన స్త్రీలు శ్రావణమాసం తొలిమంగళవారంతో మంగళగౌరీ వ్రతాన్ని విధిగా ప్రారంభించి ఐదు సంవత్సరాలు దీక్షగా ఆచరించాలి. అలా ఈ వ్రతాన్ని చేపట్టిన స్త్రీలపై శ్రీ మంగళగౌరి కటాక్షముతో వైధవ్యబాధలు లేకుండా వారీ జీవితాంతం సర్వసౌఖ్యములతో గడుపుతారని పురోహితులు అంటున్నారు.

మరోవైపు.. మంగళగౌరీవ్రతమును ఆచరించే అల్పాయుష్కుడైన తన భర్తను గండముల నుంచి తప్పించి దీర్ఘసుమంగళిగా వర్ధిల్లిందని పురాణాలు చెబుతున్నాయి. అందుచేత శ్రావణమాసంలో వచ్చే మంగళవారం పూట కొత్తగా పెళ్లైన స్త్రీలు గౌరీమాతను దీక్షతో ప్రార్థిస్తే సర్వమంగళం చేకూరుతుందని విశ్వాసం.

కరుణించవా చెలీ... నన్ను ఓసారి...!


ఎదురుగ వచ్చావని పొంగిపోయి కళ్లు తెరచినవేళ
కళ్లముందు నిలిచింది స్వప్నమని తెలిసి మనసు చిన్నబోయింది

చెవులను సోకిన అడుగుల సవ్వడి నిదేనని తలచి వెనుదిరిగి చూసినవేళ
రాలిన ఆకులు చేసిన సవ్వడని తెలిసి హృదయం కలుక్కుమంది

ఎవరి స్వరం విన్నా అది నీదేనేమోనని మదికి తోచినవేళ
కాదని తెలిసి ఊరుకోమని చెబుతుంటే మది సైతం మొరాయిస్తోంది

కరుగుతున్న మంచులా కాలం కరిగిపోతున్నా నీకూ నాకూ మధ్య దూరం మాత్రం ఎందుకో నిత్యం పెరుగుతూనే ఉంది
ఎన్నాళ్లీ ఎదురుచూపులంటూ మనసు నిత్యం రోదిస్తుంటే... దానికేం చెప్పాలో తెలియక హృదయం తల్లడిల్లుతోంది.

ప్రేమకు శక్తి ఉందో లేదో తెలియదుకానీ... నిన్ను చూశాకే నా మనసు పొరల్లో స్పందన నాకు వినిపించింది. కానీ ఎందుకో నేను ఎరగనుకానీ... నాలోని స్పందన నీకు మాత్రం వినిపించనంటోంది.

అయినాసరే నిను చూశాక నాలో చెలరేగిన ప్రేమనే ఈ అలల తాకిడి నిన్ను సైతం తాకే వరకు ఇలాగే మౌనంగా నీకోసం ఎదురు చూస్తూనే ఉంటాను. కరుణించినా... కాదంటూ నన్ను గెంటేసినా నీకోసం సాగిస్తున్న ఈ నిరీక్షణ మాత్రం ఆగిపోదు సుమా.

SV Bhakti TV channel


Sri Venkateswara Bhakti channel was launched by Sri Sri Ranga Ramanjua Pedda Jeeyar Swamy of Tirumala at Srivari temple on Monday on the occasion of Ugadi.
The exclusive TV channel of TTD, will telecast live several programmes in the temple along with different featured programmes on devotion and culture. TTD chairman B Karunakar Reddy, executive officer KVRamanachary, board member Chadalavada Sudha, Bhakti Channel CEO'KS. Sarma, CE VSB Koteswara Rao, temple Dy EO Siddaiah and others were present.
According to TTD officials, the response to the channel is overwhelming and the signals are being received with clarity all over the State. There are several reports that people in different places are asking their cable operators to ensure that they get SV Bhakti channel.