రండి రండి రండి దయచేయండి తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ..........

Showing posts with label పుణ్యక్షేత్రాలు. Show all posts
Showing posts with label పుణ్యక్షేత్రాలు. Show all posts

Ashta Vinayaka


Ashta Vinayaka Darshan
(Rare pictures of Lord Sri Vinayaka)

Prominent among the temples of Lord Sri Ganesha are a cluster of eight temples popularly known as Ashta Vinayaka temples which are totally dedicated to Lord Sri Maha Ganapathi. These temples are very ancient where Lord Sri Vinayaka had manifested in different cosmic ages. They are,
  1. Sri Mayureshwar at Moregaon
  2. Sri Siddhi Vinayaka at Siddhatek
  3. Sri Ballaleshwar at Pali
  4. Sri Varada Vinayaka at Mahad
  5. Sri Chintamani at Theur
  6. Sri Girijaatmaj at Lenyadri
  7. Sri Vighneshwar at Ozhar
  8. Sri Maha Ganapathi at Ranjangaon
All these eight temples are located in the state of Maharastra within a radius of about 100 km from Pune city. It is not possible to cover all these temples visit within one day. It requires minimum two or three days for a complete visit. Conducted tour facilities are available from Pune as well as from Mumbai cities. Total distance coverage from Pune will be around 650 km and from Mumbai it will be around 750 km. Please find below rare pictures of Lord Sri Vinayaka at these temples.

(Sri Mayureshwar at Moregaon)

(Sri Siddhi Vinayak at Siddhatek)

(Sri Ballaleshwar at Pali)

(Sri Varada Vinayak at Mahad)

(Sri Chintamani at Theur)

(Sri Girijaatmaj at Lenyadri)

(Sri Vighneshwar at Ojhar)

(Sri Maha Ganapathi at Ranjangaon)

(Route map to Ashta Vinayaka temples)

ఉత్తరాంధ్ర "తిరుమలగిరివాసుడు"

"శ్రీ శ్రీనివాస గోవిందా.. శ్రీ వేంకటేశా గోవిందా.. భక్తవత్సలా గోవిందా.. భాగవతప్రియా గోవిందా... ఆపద మొక్కుల వాడా.. అనాధ రక్షకా... పాహిమాం... పాహిమాం..." అంటూ భక్తులు నిత్యం కొలిచే దైవం శ్రీవేంకటేశ్వరుడు. కలియుగంలో ప్రత్యక్ష దైవంగా భక్తుల నీరాజనాలందుకుంటున్న ఈ దైవానికి దేశంలోనే కాదు, విదేశాల్లో కూడా అనేకమైన ఆలయాలున్నాయి.

అయితే ఎన్ని ఆలయాలున్నప్పటికీ.. అవన్నీ ఏడుకొండలపై కొలువైఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం తరువాతే అని చెప్పవచ్చు. తిరుమల తరువాత అంతటి ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది శ్రీకాకుళం పట్టణంలోని నారాయణ తిరుమలగిరిపై కొలువుదీరిన శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయం. ఉత్తరాంధ్ర భక్తజనకోటికి అభయప్రదాతగా నిలిచిన ఆ దేవదేవుడి ఆలయాన్ని చూసి వద్దాం రండి...!

ఉత్తరాంధ్ర జిల్లాల్లోనే తిరుమలగిరిపై నెలవైన శ్రీవేంకటేశ్వర ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది. అదేంటంటే... తిరుమల వెళ్లలేని భక్తులు ఈ ఆలయానికి విచ్చేసి, స్వామివారిని దర్శించుకుని మొక్కుబడులను తీర్చుకుని వెళ్తుంటారు. ఇక్కడి కొండపైన ప్రకృతి సౌందర్యం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది.

ఆలయ చరిత్రను చూస్తే... ఒక భక్తుడి సంకల్పం ఫలితంగా ఈ ఆలయ నిర్మాణం జరిగినట్లు పూర్వీకులు చెబుతుంటారు. వేదాంత ప్రవక్త అయిన గురుగుబెల్లి నారాయణదాసు అనే భక్తుడి కలలో శ్రీవేంకటేశ్వర స్వామివారు ప్రత్యక్షమై నారాయణ తిరుమల కొండపై ఆలయం నిర్మించమని ఆదేశించారట.

స్వామివారి ఆదేశానుసారం... నారాయణదాసు అనువైన కొండ కోసం గాలిస్తుండగా, నాగావళి నదికి పశ్చిమ దిశలోని ఒక కొండను ఎంపిక చేశాడు. ఈ కొండపైని స్వామివారి పాదాల గుర్తులను అనుసరించి, అక్కడ ఆలయ నిర్మాణాన్ని చేపట్టాడు. 1961వ సంవత్సరంలో తిరుపతిలో తయారు చేయించిన భూనీలాసమేత శ్రీవేంకటేశ్వర స్వామివారి విగ్రహాలను పాంచరాత్రాగమ ప్రకారం ప్రతిష్టించాడు. అనంతరం 1997లో నారాయణదాసు మృతి చెందేదాకా ఆలయ ధర్మకర్తగా వ్యవహరించాడు.

అలా... నారాయణ తిరుమల కొండపై నిర్మాణమైన శ్రీవేంకటేశ్వర ఆలయం ఎన్నో ప్రత్యేకతలతో అలరారుతోంది. ఆలయంలోని శ్రీరామానుజాచార్య, శ్రీనమ్మాళ్వార్ విగ్రహాలు.. స్వామివారి దశావతారాలైన మత్స్య, కూర్మ, వరాహ, నర్సింహ, వామన, పరశురామ, రామ, శ్రీకృష్ణ, బలరామ, కల్కి అవతారాలతో కూడిన విగ్రహాలను భక్తులను పారవశ్యంలో ముంచెత్తుతాయి.

దేశంలోనే అత్యంత ఎత్తయిన గరుత్మంతుని (గరుఢ) విగ్రహం ఈ ఆలయంలో కలదు. అలాగే అష్టలక్ష్మి వైభవాన్ని విశదీకరించే లక్ష్మీదేవి విగ్రహాలు ఈ ఆలయానికే ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకోవచ్చు. ఆలయంలో ఐదు అంతస్తుల గాలి గోపురం తిరుమలేశుని సన్నిధిని గుర్తుకు తెస్తుంది. ఆలయంలోని బేడా మండపం, కళ్యాణ మండపం, యాగశాల, పుష్కరిణి, ప్రాకారాలు ఆకట్టుకుంటాయి.

ఈ శ్రీవేంకటేశ్వర ఆలయంలో ఆగమ శాస్త్రం ప్రకారం నిత్య పూజాదికాలను నిర్వహిస్తుంటారు. ప్రతి సంవత్సరం స్వామివారికి కళ్యాణంతోపాటు, శ్రీకృష్ణాష్టమి, భీష్మ ఏకాదశి, వైకుంఠ ఏకాదశి తదితర పండుగలను, పర్వదినాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తుంటారు. ఆలయంలో ప్రతిరోజూ బ్రహ్మ ముహూర్తంలో విష్ణు సహస్ర నామపారాయణం జరుగుతుంటుంది.

ఎలా వెళ్ళాలంటే... శ్రీకాకుళం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండుకు కిలో మీటరు దూరంలో ఉంటుంది శ్రీవేంకటేశ్వర ఆలయం. శ్రీకాకుళం రోడ్ (ఆముదాల వలస) రైల్వే స్టేషన్‌కు పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బస చేయాలనుకునేవారికి శ్రీకాకుళం పట్టణంలో అనేకమైన వసతి సౌకర్యాలు కలవు.

షెండూర్ని త్రివిక్రమ దేవుని వైభవం


తీర్థయాత్రలో భాగంగా ఈసారి మిమ్మల్ని మహారాష్ట్రలోని త్రివిక్రమ దేవాలయానికి తీసుకువెళుతున్నాం. త్రివిక్రమ ఆలయాన్ని 1744లో సుప్రసిద్ధ సన్యాసులు శ్రీ కడోగి మహరాజ్ నిర్మించారు. ఈ ఆలయం మహారాష్ట్రలోని షెండూర్ని గ్రామంలో ఖాందేష్ ప్రాంతంలో నెలకొని ఉంది.

ఆలయ ప్రధాన అర్చకులు శాంతారామ్ మహరాజ్ భగత్ చెప్పినదాని ప్రకారం... శ్రీ కడోగి సన్యాసులవారు పాంధర్‌పూర్‌లోని విఠలేశ్వరుని దర్శించుకునేందుకు ఏటా కాలినడకన వెళ్లేవారట. ఒకరోజు స్వామివారిని దర్శించుకునేందుకు వెళుతుండగా మార్గమధ్యంలో సన్యాసులవారి ముందు విఠలేశ్వర స్వామివారు ప్రత్యక్షమయ్యారట.

అనంతరం కడోగి సన్యాసులవారితో తన విగ్రహం షెండూర్ని గ్రామంలోని ఓ నది ఒడ్డున భూమిలో ఉన్నదని చెప్పారట. తన
వాహనమైన వరాహంతోపాటు తన విగ్రహాన్ని వెలికి తీసి శాస్త్రోక్తంగా దేవాలయంలో ప్రతిష్టించమని చెప్పారట. అలా విఠలేశ్వరుడు చెప్పిన ఆ రోజు కార్తీక శుద్ధ ఏకాదశి.

ఇది జరిగిన తర్వాత కడోగి సన్యాసులవారు నేరుగా తన స్వగ్రామానికి వచ్చి జరిగిన విషయాన్ని తోటి గ్రామస్తులకు తెలిపారట. అయితే ఆయన మాట ఎవరూ నమ్మలేదు. నమ్మకపోవడం అటుంచి... గ్రామస్తులందరూ కలిసి అతనో పిచ్చివాడని గేలి చేయడం మొదలుపెట్టారు. కానీ కడోగి మాత్రం ఎలాగైనా స్వామివారి విగ్రహాన్ని వెలికితీయాలని నిర్ణయించుకున్నాడు.

అంతే... నది ఒడ్డుకు వెళ్లి స్వామివారు చెప్పిన ప్రదేశంలో భూమిని తవ్వటం మొదలుపెట్టాడు. ఇలా తవ్వుతుండగానే కొంతదూరంలో వరాహ విగ్రహం బయటపడింది. విగ్రహాన్ని చూసిన గ్రామస్తులు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. తాము కూడా స్వామివారి విగ్రహాన్ని వెలికి తీయడానికి తవ్వకాలు మొదలుపెట్టారు. అలా 25 అడుగుల లోతువరకూ తవ్విన పిమ్మట సుమారు నాలుగున్నర అడుగులు ఎత్తున్న స్వామివారి విగ్రహం భక్తులకు దర్శనమిచ్చిందట. ఆ విగ్రహాన్ని భక్తులందరూ కలిసి ఆలయంలో శాస్త్రోక్తంగా ప్రతిష్టించారు.

అయితే స్వామివారిని వెలికితీసే ప్రక్రియలో గునపంతో తవ్వుతుండగా పొరపాటున విఠలేశ్వరుని విగ్రహం ముక్కుపై గునపపు గాటుపడిందట. దాంతో స్వామివారి విగ్రహం ముక్కు నుంచి రక్తం కారడం మొదలైందట. ఇది మహా అద్భుతమైన విషయమని చెపుతారు. ఈ విగ్రహపు మరో ప్రత్యేకం ఏమిటంటే... విష్ణు, విఠలుడు, బాలాజీ.. ఇలా మూడు రకాలుగా ఈ విగ్రహం గోచరిస్తుంది.

ఈ కారణం చేతనే ఈ విగ్రహానికి త్రివిక్రమ స్వామివారనే పేరు వచ్చింది. అంతేకాదు సమయాన్నిబట్టి ఆ విగ్రహం తన స్వరూపాన్ని మార్చుకుంటుందని భక్తుల విశ్వాసం. విఠలేశ్వరునితోపాటు ఆయన వాహనం వరాహాన్ని కొలిచినవారు పుట్టెడు దుఃఖాల నుంచి విముక్తి పొందగలరు. అంతేకాదు ఎటువంటి సమస్యలనుంచైనా తన భక్తులను దరిచేర్చుతాడు విఠలేశ్వరుడు.

కడోగి సన్యాసులవారు ప్రతి ఏడాది కార్తీక శుద్ధ ఏకాదశినాడు త్రివిక్రమ స్వామివారికి రథయాత్ర ఉత్సవాన్ని నిర్వహించేవారు. అలా ఆనాడు ఆయన ప్రారంభించిన రథోత్సవం నేటికీ కొనసాగుతూనే ఉన్నది. సుమారు 25 అడుగులు ఎత్తున్న ఈ రథం 263 ఏళ్లనాటిదని చెపుతారు. అయినా స్వామివారిని ఊరేగించేందుకు ఈ రథం పనిచేస్తూనే ఉంది. ఈ రథోత్సవానికి ప్రతి ఏటా పెద్ద ఎత్తున భక్తులు హాజరవుతుంటారు.

ఎలా వెళ్లాలి?

రోడ్డు ద్వారా: జల్గోన్ జిల్లాలోని జామ్నర్ పట్టణానికి త్రివిక్రమ ఆలయం 16 కిలోమీటర్ల దూరంలో ఉంది.

రైలు ద్వారా: జల్గోన్ ప్రధాన రైలు జంక్షన్. ఇక్కడ నుంచి షెండూర్ని గ్రామం సుమారు 45 కిలో మీటర్ల దూరంలో ఉంది.

విమానం ద్వారా: ఔరంగాబాద్ సమీప విమానాశ్రయం. ఔరంగాబాద్ నుంచి షెండూర్ని 125 కిలోమీటర్ల దూరంలో ఉంది.

వడోదర కాశీ విశ్వనాథుడు



ఈసారి మిమ్మల్ని గుజరాత్‌లోని వడోదర కాశీ విశ్వనాథ ఆలయానికి తీసుకువెళుతున్నాం. ఈ చారిత్రక ఆలయాన్ని 120 ఏళ్ల కిందట సయాజీరావు గైక్వాడ్ పాలనా కాలంలో నిర్మించినట్లు చెపుతారు.

గైక్వాడ్ తదనంతరం ఆలయాన్ని స్వామి వల్లభరావుకి అప్పగించినట్లు చెపుతారు. ఆ తర్వాత స్వామి చిదానంద్ సరస్వతి అధీనంలోకి వచ్చింది. చిదానంద్ 1948లో ఆలయానికి పునరుద్ధరణ పనులు చేపట్టారు. చిదానంద్ సరస్వతి మరణానంతరం ఆలయాన్ని ట్రస్ట్‌కు అప్పగించడం జరిగింది. అప్పటి నుంచి నేటికీ ఆలయ నిర్వహణను ట్రస్ట్ చూసుకుంటోంది.

కాశీ విశ్వనాథుని ఆలయం గైక్వాడ్ ప్యాలెస్‌కు ఎదురుగా ఉంటుంది. ఆలయ ప్రధాన ద్వారం చాలా పెద్దదిగానూ అందంగానూ ఉంటుంది. ప్రధాన ద్వారం వద్ద నల్లరాతితో మలచబడ్డ నందీశ్వరుని విగ్రహం ఉంటుంది.

నందీశ్వరునితోపాటు అక్కడ ఓ తాబేలు విగ్రహం కూడా గోచరిస్తుంది. ఈ తాబేలును అదృష్టానికి ప్రతీకగా భక్తులు విశ్వసిస్తారు. ఇక నందీశ్వరని విగ్రహానికి ఆవల స్వామీ వల్లభ రావు, స్వామీ చిదానంద విగ్రహాలు కనబడతాయి.

ఈ ఆలయాన్ని రెండు భాగాలుగా నిర్మించారు. మొదటి భాగం విశాలమైన హాలులా ఉంటుంది. ఇక్కడ భక్తులు ప్రార్థనలు చేసుకోవచ్చు. రెండో భాగంలో స్వామివారు వేంచేసిన గర్భగుడి ఉంది. దీనిని తెల్లరాతితో నిర్మించారు. ఆలయ నిర్మాణానికి ఉపయోగించిన పిల్లర్లపై ఆయా దేవతల విగ్రహాలు చెక్కబడి ఉన్నాయి. ఆలయ గోపురం కనువిందుగా ఉంటుంది.

గర్భగుడిలో శివలింగం వెండి తాపడం చేసి అత్యంత రమణీయంగా కనిపిస్తుంటుంది. ఈ శివలింగాన్ని తాకేందుకు భక్తులను అనుమతించరు. స్వామివారికి పాలు, నీళ్లను సమర్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి.

ఈ ఆలయ ప్రాంగణంలో కాశీ విశ్వనాథ్ హనుమాన్ మరియు సోమనాథ్ మహదేవ్ దేవుళ్లకు చెందిన మరో రెండు చిన్న చిన్న ఆలయాలు దర్శనమిస్తాయి. ఈ చిన్న ఆలయాల్లో స్వామి చిదానంద పాదముద్రికలు ఉన్నాయి.

శ్రావణమాసంలో ఇక్కడ నిర్వహించే ఉత్సవానికి భక్తులు లక్షల సంఖ్యలో వస్తారు. త్రయోదశినాడు వేలమంది భక్తులు స్వామివారిని దర్శించుకుని దీవెనలు అందుకుంటారు. ఆలయంలో భక్తులకు ఉచిత భోజన వసతి కలదు. భోజన ఏర్పాట్లను ఆలయ ట్రస్ట్ పర్యవేక్షిస్తుంది.

ఎలా వెళ్లాలి:

రోడ్డు మార్గం: గాంధీనగర్‌కు వడోదర 115 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఇక గుజరాత్ రాజధాని అహ్మదాబాదు నుంచైతే 130 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

రైలు ద్వారా: ఢిల్లీ- ముంబై రైలు మార్గంలో వడోదర ప్రధాన రైలు జంక్షన్. దేశంలోని ప్రధాన నగరాల నుంచి వడోదరకు రైలు సౌకర్యం ఉన్నది.

విమానం ద్వారా: వడోదరకు సమీపంలో ఉన్న విమానాశ్రయం అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు. ఇక్కడ నుంచి వడోదరకు 111 కిలో మీటర్ల దూరం ఉంటుంది.