రండి రండి రండి దయచేయండి తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ..........

Showing posts with label ఇది సంగతి. Show all posts
Showing posts with label ఇది సంగతి. Show all posts

స్నేహం

* "స్నేహం పాతబడిన కొద్దీ బాగుంటుంది..." చిం గ్‌చౌ

* "శత్రువు ఒక్కడైనా ఎక్కువే. మిత్రులు వంద అయి నా తక్కువే.." వివేకానందుడు

* "విశ్వాసం లేకుండా స్నేహం ఉండదు..." గౌతమబుద్ధుడు * మనిషికి అవసరంలో ఆదుకున్న మిత్రుడికన్న ప్రియమైనది ఏదీ ఉండదు..." గురునానక్

* "కష్టకాలంలోనే మిత్రుడెవరో తెలుస్తుంది" మహాత్మాగాంధీ

* "అహంకారికి మిత్రులుండరు" ఆస్కార్‌వైల్డ్* "ఇచ్చింది మరిచిపోవడం, పుచ్చుకున్నది జ్ఞాపకం ఉంచుకోవడమే స్నేహం" మహాత్ముడు

* "ఎవరితోనైనా స్నేహం చేయడం సులభమే, కానీ ఎక్కువ కాలం నిలుపుకోగలకడమే కష్టం" కార్డినల్‌న్యూమాన్

* "చెడ్డ మిత్రుల కన్నా మిత్రుడు లేక పోవడమే నయం" మార్టిన్ లూథర్‌కింగ్

* "నీ తప్పును, నీ తెలివి తక్కువ పనులను నీ ముందు0చువాడే నిజమైన నీ స్నేహితుడు" బెంజిమన్ ఫ్రాక్లిన్

* "మనిషిని బట్టే అతని స్నేహితుడు ఉంటారు" స్వీడెన్ బర్గ్ <

* "మాటలకే పరిమితమయ్యే మిత్రుడెపుడు నీ మిత్రుడుగా ఉండలేడు" లియోటాల్‌స్టాయ్

* "మిత్రున్ని మించిన అద్దం లేదు మిత్రుడు లేకుండా ఏ మనిషి సర్వసంపూర్ణుడు కాలేడు" సెయింట్ బెర్నార్డ్

ఎవరైనా కావచ్చు...


అందరూ కలలుగంటారు. అందరూ కష్టపడతారు. అందరూ సంపాదిస్తారు.కానీ కొందరే, సంపన్నులవుతారు. ఎందుకు? ఆర్థిక విజేతల్లో కనిపించే అరుదైన లక్షణాలే అందుకు కారణమంటున్నారు నిపుణులు. వాటిని ఒంటబట్టించుకుంటే ఎవరైనా కావచ్చు... కరోడ్పతి!
‘ఆయన కోటీశ్వరుడు'
...గౌరవంగా చూస్తాం.
‘ఆ కారు ఖరీదు యాభైలక్షలు'
...రెప్పవాల్చడం కూడా మరచిపోతాం.
‘ఆమెకు ఆన్‌లైన్‌ లాటరీలో కోటిరూపాయలొచ్చాయి'
...కళ్లల్లో నిప్పులు పోసుకుంటాం.
‘అదిగో, వెయ్యి రూపాయల నోటు!'
ఆశగా తలతిప్పుతాం.
అది డబ్బు పవర్‌. కరెన్సీ ప్రభావం. శ్రీమహాలక్ష్మి మహత్యం.
సూర్యుడి చుట్టూ భూమి తిరిగినట్టు, డబ్బు చుట్టూ ప్రపంచం తిరుగుతుంది. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలు కాకపోవచ్చు. కానీ, ఏదో ఒక సందర్భంలో ఆర్థిక సంబంధాలు మానవసంబంధాల్ని ప్రభావితం చేస్తాయి. ఎవరైనా ‘నాకు డబ్బు మీద ఆసక్తిలేదు' అన్నారంటే...సంపాదించడం చేతకాదని ఒప్పేసుకున్నారని అర్థం.

మీరు డబ్బును ప్రేమించే వ్యక్తుల జాబితాలో ఉండవచ్చు. ద్వేషించే వ్యక్తుల జాబితాలోనైనా ఉండవచ్చు. ఏ జాబితాలో ఉన్నా, బతికున్నంతకాలం డబ్బు అవసరాన్ని కాదనలేరు. ఇది నిజం. బతకడానికి సరిపడా ఆక్సిజన్‌లా, అవసరాలకు తగినంత కరెన్సీ ఉండితీరాలి. అలా అని, డబ్బున్నంత మాత్రాన సుఖంగా ఉంటామని ఎవరూ గ్యారెంటీ ఇవ్వలేరు. కానీ డబ్బులేకపోతే కష్టాలపాలవుతామన్నది మాత్రం అక్షర సత్యం. అందుకే, డబ్బంటే అంత ఆరాటం. తరాలకు సరిపడా సంపాదించుకోవాలన్న తహతహ. ఉద్యోగం చేసినా వ్యాపారం చేసినా బొమ్మలు గీసినా పుస్తకాలు రాసినా...అంతా డబ్బు కోసమే. తృప్తి, ఆనందం, కళాభిమానం...ఎవరెన్ని కారణాలు చెప్పినా అన్నీ కరెన్సీ తర్వాతే.
వందకోట్ల జనాభాలో ఓ పదిమంది ప్రపంచ కుబేరుల జాబితాలో స్థానం సంపాదిస్తారు. ఓ వందమంది దేశంలోని శ్రీమంతుల లిస్టులో ఉంటారు. లక్షమందో, పదిలక్షలమందో కోటీశ్వరులని అనిపించుకుంటారు. మిగతావాళ్లంతా మామూలు మనుషులు. ఒకటో తేదీ ఎప్పుడొస్తుందా అని మిగిలిన ఇరవైతొమ్మిది రోజులూ ఎదురుచూసే సగటు జీవులు.
ఎందుకిలా?
కొంతమందే సంపన్నులు కావడం ఏమిటి, మిగతావాళ్లంతా మధ్యతరగతి జీవులుగానో నిరుపేదలుగానో మిగిలిపోవడం ఏమిటి? అసలు, డబ్బు సంపాదించడానికి అర్హతలేమిటి?
తెలివితేటలా, శ్రమా, అదృష్టమా.
తెలివైనవాళ్లు మాత్రమే బాగా డబ్బు సంపాదిస్తారనడానికి ఎలాంటి ఆధారాల్లేవు. సంపన్నులంతా మేధావులు కారు. మేధావులంతా సంపన్నులు కారు.కష్టపడేగుణముంటే, కోటీశ్వరులు కావచ్చనీ బల్లగుద్ది చెప్పలేం. చెమటే కొలమానమైతే, కరెన్సీ మున్ముందుగా శ్రమజీవుల్నే వరించాలి. అలాంటి దాఖలాలేం లేవు. అదృష్టానికీ డబ్బుకూ కూడా ముడిపెట్టలేం. బిల్‌గేట్స్‌, వారెన్‌ బఫెట్‌, నారాయణమూర్తి... వీళ్లెవర్నీ సిరిసంపదలు అయాచితంగా వరించలేదు. రాత్రికిరాత్రే ఎవరూ సంపన్నులైపోలేదు. అంటే...పూర్తిగా తెలివితేటలే కాదు. పూర్తిగా శ్రమే కాదు. పూర్తిగా అదృష్టమూ కాదు. ఇంకేవో లక్షణాలున్నాయి. అవే కుబేరుల్ని తయారుచేస్తాయి. అవి, కన్నవారో గురువులో ఒంటబట్టించినవి కావచ్చు, ఎవరికివారే తీర్చిదిద్దుకున్నవీ కావచ్చు. ఆర్థిక వికాస సాహిత్యాన్ని ఓ మలుపుతిప్పిన రాబర్ట్‌ కియోసాకీ కూడా ఈ మాట నిజమేనంటున్నారు.

బాల్యమే పునాది...
‘నాన్నా! నాకు కంప్యూటర్‌ కావాలి'
‘మనదగ్గర అంత డబ్బు లేదమ్మా. మనం మధ్యతరగతి మనుషులం. పెద్దపెద్ద కోరికలు ఉండకూడదు'...తెలిసోతెలియకో పిల్లల ఆశల్ని బలవంతంగా చిదిమేస్తాం. అలా కాకుండా ఆ కంప్యూటర్‌ ధర ఎంతో, తమ సంపాదన ఎంతో, దాన్ని కొనాలంటే అదనంగా ఇంకెంత సంపాదించాలో వివరంగా చెబితే...పిల్లలు తప్పకుండా అర్థంచేసుకుంటారు. ప్రతి సమస్యనీ ప్రతి అవసరాన్నీ ఆర్థిక కోణం నుంచి చూడటం నేర్చుకుంటారు.
ఆర్థిక అక్షరాస్యత అనేది బాల్యం నుంచే మొదలుకావాలంటారు రాబర్ట్‌ కియోసాకీ తన ‘రిచ్‌డాడ్-పూర్‌డాడ్' పుస్తకంలో. ఆ కథలో ఓ కుర్రాడికి బాగా డబ్బు సంపాదించాలని కోరికగా ఉంటుంది. తండ్రేమో ఎప్పుడూ, ‘కష్టపడి చదువుకో. ర్యాంకు తెచ్చుకో. మంచి కంపెనీలో ఉద్యోగం తెచ్చుకో. అస్సలు రిస్క్‌ తీసుకోవద్దు' అని పోరుతుంటాడు. తండ్రి చెప్పినట్టే నడుచుకుంటే తాను అప్పుల్లో మునిగితేలే మధ్యతరగతి మనిషిగానే మిగిలిపోతానని ఆ కుర్రాడికి అర్థమైపోతుంది. తనకెలాంటి నాన్న కావాలని కోరుకుంటున్నాడో సరిగ్గా అలాంటి లక్షణాలున్న నాన్న, స్నేహితుడి తండ్రిలో కనిపిస్తాడు. అందుకే అతన్ని తండ్రిలా గౌరవిస్తాడు. ‘రిచ్‌డాడ్' అని వ్యవహరిస్తాడు. ఆయన దగ్గర శిష్యరికం చేస్తాడు. డబ్బు సంపాదించే మెలకువలు నేర్చుకుంటాడు. జీవితంలో గొప్ప స్థానానికి చేరుకుంటాడు. ఈ పుస్తకం లక్షల కాపీలు అమ్ముడుపోయింది. దాదాపుగా ప్రపంచ భాషలన్నిట్లోకీ అనువాదమైంది.

మనలో చాలామంది పెద్దపెద్ద చదువులు చదువుకుని ఉండొచ్చు. కానీ, ఆర్థిక విషయాలకు వచ్చేసరికి తొంభైశాతం మంది నిరక్షరాస్యులే. డబ్బు ఎలా సంపాదించాలో తెలియదు, సంపాదించిన డబ్బును ఎలా రెట్టింపుచేసుకోవాలో తెలియదు. ఎల్‌కేజీ నుంచి పీజీ దాకా ఎక్కడా ‘డబ్బు సంపాదించడం ఎలా' అన్న పాఠం ఉండదు. కన్నవారూ ఆ ప్రయత్నం చేయరు. పిల్లలే చొరవ తీసుకుని ప్రస్తావించినా ‘పసివాడివి, నీకెందుకురా డబ్బు ఆలోచనలు? బాగా చదువుకో' అని మందలిస్తారు. డబ్బు గురించి తెలుసుకోవడం కూడా ఓ చదువే అని గుర్తించరు. ఎవర్నని ఏం లాభం? మన చదువులే అలా ఉన్నాయి. తండ్రులైనా, తండ్రుల తండ్రులైనా అక్షరాలు దిద్దుకుంది ఆ బళ్లోనేగా.
చాలా సందర్భాల్లో పెద్దపెద్ద వ్యాపార సామ్రాజ్యాలు పేకమేడల్లా కూలిపోడానికి కూడా పిల్లల పెంపకంలోని లోపాలే ప్రధాన కారణం. అంతంతమాత్రం చదువులతో అంతంతమాత్రం ఆర్థిక స్థోమతతో డొక్కు సైకిలు మీద జీవితాన్ని ప్రారంభించే తండ్రి..స్కూటరు స్థాయికి, ఆతర్వాత కారు స్థాయికి, ఇంకాపైకెళ్లి చార్టర్డ్‌ ఫెk్లట్‌ స్థాయికి చేరుకుంటాడు. పిల్లల్ని ఖరీదైన బోర్డింగ్ స్కూళ్లలో, పెద్దపెద్ద కాలేజీల్లో చదివిస్తాడు. అక్కడ ఎవరూ డబ్బు గురించి వాస్తవాలు బోధించరు. ఎలా సంపాదించాలో, ఎలా కాపాడుకోవాలిో, ఎలా వృద్ధిచేసుకోవాలో చెప్పరు. కన్నతండ్రి కూడా ఎప్పుడూ ఆ ప్రయత్నం చేయడు. బహుశా, క్యాంపస్‌లోనే తన కొడుకు చాలా విషయాలు నేర్చుకున్నాడన్న భ్రమ కావచ్చు. ఆ పట్టాల్ని నమ్మి వ్యాపారం అప్పగిస్తే, కుప్పకూలిపోవడం ఖాయం. కొన్ని కూలిపోయాయి కూడా. ఆ ప్రమాదం రాకూడదనే, విజ్ఞత ఉన్న వ్యాపారవేత్తలు పిల్లలకు ఒక్కసారిగా మొత్తం బాధ్యతలు అప్పగించరు.ప్రాథమిక స్థాయి నుంచి ఒక్కోమెట్టూ ఎక్కి పైకొచ్చేలా జాగ్రత్త పడతారు. ఉక్కు దిగ్గజం లక్ష్మీనివాస్‌ మిట్టల్‌ తన కొడుకు ఆదిత్యను పెంచిన తీరే అందుకు ఉదాహరణ. ఆదిత్య హైస్కూలు చదువుల దశలోనే శని, ఆదివారాలు తండ్రి స్టీల్‌ప్లాంట్‌లోని ‘మెల్ట్‌ షాప్‌'లో పనిచేసేవాడు. అక్కడ విపరీతమైన వేడి. చెవులు చిట్లిపోయేంత రణగొణ ధ్వనులుంటాయి. సాధారణ కార్మికులు కూడా ఆ విభాగంలిో డ్యూటీ చేయడానికి భయపడతారు. ఆదిత్యకు ఇప్పటికీ ఎయిర్‌ కండిషన్డ్‌ క్యాబిన్‌లో కూర్చోవడం కన్నా, మెల్ట్‌షాప్‌లో గడపడమంటేనే ఇష్టమట. అంటే, మిట్టల్‌ కంపెనీ షేర్‌హోల్డర్లు ఇంకోతరం దాకా ధైర్యంగా ఉండొచ్చన్నమాట.
ఒకప్పటి ప్రపంచ కుబేరుడు, హైదరాబాద్ నిజాం మీర్‌ ఉస్మాన్‌అలీఖాన్‌ వారసుడు ప్రిన్స్‌ ముకరంజా ఆస్తిపాస్తులన్నీ పోగొట్టుకుని, ఆస్ట్రేలియాలో సాధారణ జీవితం గడుపుతున్నాడు. లెక్కలేనంత సంపదను వారసత్వంగా ఇచ్చిన ఉస్మాన్‌ అలీఖాన్‌, దాన్నెలా కాపాడుకోవాలో అతనికెప్పుడూ చెప్పుండకపోవచ్చు. తండ్రో తాతో ఆర్థిక గురువైతే, ఏ బిడ్డకీ ఇలాంటి పరిస్థితి రాదు.

అనుభవాలే పాఠాలు
కుబేరులెప్పుడూ డబ్బు గురించే ఆలోచిస్తూ ఉంటారనీ నిద్రలోనూ శ్రీమహాలక్ష్మిని కలవరిస్తారనీ చాలామంది భావిస్తారు. అది తప్పు. ధీరూభాయ్‌ అంబానీ పెద్దపెద్ద కలలు కన్నాడు. వాటిలో ఎక్కడా డబ్బు ప్రస్తావన లేదు. రతన్‌టాటా వాటాదారుల సమావేశంలో లాభనష్టాల వివరాల్ని ఒకటిరెండు మాటల్లో క్లుప్తంగా చెప్పేసి, మిగిలిన సమయమంతా విలువల గురించి వ్యాపారంలో నైతికత గురించే మాట్లాడతారు.ఈ ఇద్దరే కాదు, కోట్లరూపాయల సంపాదనతో కుబేరులైపోయిన వారెవరూ ‘బాగా డబ్బు సంపాదించాలి' అన్న కోరికతో జీవితాల్ని ప్రారంభించలేదు. వాళ్లంతా లక్ష్యాల గురించి ఆలోచించారు. విజయాల గురించి ఆలోచించారు. సవాళ్ల గురించి ఆలోచించారు. ఆ సవాళ్లు నేర్పించే పాఠాల గురించి ఆలోచించారు. ‘సిరితావచ్చిన వచ్చును...' అన్నట్టు సంపదలు, పేరుప్రతిష్ఠలు, పురస్కారాలు వాటంతట అవే పరిగెత్తుకొచ్చాయి. కియోసాకీ పుస్తకంలో ‘రిచ్‌డాడ్' ఓ గొప్ప మాట చెబుతాడు, ‘జీవితాన్ని మించిన గురువు లేడు. ఆ గురువు ఎప్పుడూ మనతో మాట్లాడడు. నీతులు బోధించడు. కానీ అనుభవాల బెత్తం దెబ్బలు వేస్తుంటాడు. ఆ గాయాల నుంచి మనం కొత్త విషయాలు నేర్చుకోవాలి'. ఆర్థిక విజేతలంతా అలాంటి దెబ్బలుతిని రాటుదేలినవారే.
సింటెక్స్‌' అనగానే నల్లగా నిగనిగలాడే నీటినిల్వ ట్యాంకులే గుర్తుకొస్తాయి. ఏ బ్రాండు ట్యాంకునైనా ‘సింటెక్స్‌ ట్యాంక్‌' అని పిలుచుకునేంతగా అవి ప్రజాదరణ పొందాయి. నిజానికి, ఆ సంస్థ యాజమాన్యం ఇలాంటి ట్యాంకుల్ని ఉత్పత్తి చేయాల్సివస్తుందని ఎప్పుడూ వూహించలేదు. మొదట్లో, పారిశ్రామిక అవసరాల కోసం ప్లాస్టిక్‌ కంటెయినర్లు తయారుచేసే వ్యాపారం వాళ్లది. అందులో తీవ్ర నష్టాలొచ్చాయి. మూసేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. లక్షలుపెట్టి కొన్న యంత్రాల్ని ఏం చేసుకోవాలి? అప్పుడే, ఐఐఎమ్‌ నుంచి పట్టాపుచ్చుకుని ఉద్యోగంలో చేరిన డంగాయచ్‌ అనే కుర్రాడు యాజమాన్యానికి నీటి ట్యాంకుల ఆలోచన చెప్పాడు. ఆరోజుల్లో అంతా సిమెంటుతో ట్యాంకులు కట్టించుకునేవారు. ఇంజినీర్లు కూడా వాటినే సిఫార్సుచేసేవారు. ప్రారంభంలో కొనుగోలుదారులు పెద్దగా ఆసక్తి చూపలేదు. చిల్లులుపడతాయనో, నీళ్లు ఖరాబైపోతాయనో ...ఏవో అపోహలు. పాతికేళ్లలో ఆ పరిస్థితుల్ని అధిగమించి సింటెక్స్‌ నంబర్‌వన్‌ స్థాయికి ఎదిగింది. డంగాయచ్‌ ఇప్పుడు ఆ సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి. దేశంలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న సీర¬వోల్లో ఆయనా ఒకరు.

వారెన్‌ బఫెట్‌- 
సాధారణ కుటుంబంలో పుట్టాడు. అంచెలంచెలుగా ఎదిగాడు. వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించాడు. కోట్లకు పడగలెత్తాడు. ఆస్తిలో చాలా భాగాన్ని గేట్స్‌ ఫౌండేషన్‌కు విరాళంగా ఇచ్చాడు. దీనివల్ల ప్రపంచ కుబేరులి జాబితాలో ఆయన స్థానం కాస్త మారింది. అయినా, మునుపటికంటే సంతృప్తికరమైన జీవితం గడుపుతున్నాడు.

రామలింగరాజు- 
సాధారణ కుటుంబంలో పుట్టాడు. అంచెలంచెలుగా ఎదిగాడు. సాఫ్ట్‌వేర్‌ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. వేల ఎకరాల భూములు సంపాదించాడు. అయినా తృప్తిచెందలేదు. ఇంకా సంపాదించే ప్రయత్నంలో దారితప్పాడు.

డబ్బు అమ్మాయి లాంటిది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించేవాళ్లనే ఇష్టపడుతుంది. దొడ్డిదార్లో దగ్గరవ్వాలని ప్రయత్నించేవాళ్లను అసహ్యించుకుంటుంది.

కసితోనో మేడలుకట్టాలన్న కోరికతోనో అడ్డదార్లు తొక్కేవారి బీరువాలోంచి ఎప్పుడు బయటపడతానా అని డబ్బు ఎదురుచూస్తూ ఉంటుంది. అవకాశం దొరగ్గానే, బయటికొచ్చేస్తుంది. సంపదను ఒక బాధ్యతగా, నలుగురి కోసం ఉపయోగపడే సాధనంగా భావించే వ్యక్తుల నట్టింట్లో సిరిదేవి బాసింపట్టు వేసుకుని కూర్చుంటుంది.

డబ్బాట!
పర్వతారోహకుడు ఎవరెస్ట్‌ శిఖరానికి ప్రయాణం కట్టినట్టు, గజ ఈతగాడు సముద్రాన్ని ఈదినట్టు...సంపాదననీ ఓ ఆటలా భావించేవారే ఆర్థికంగా గొప్ప విజయాలు సాధిస్తారని చెబుతుంది ‘బీ రిచ్‌ అండ్ హ్యాపీ' పుస్తకం. ఆటన్నాక గెలుపూ ఓటమీ ఉంటాయి. గెలిచినప్పుడు ఎవరైనా మురిసిపోతారు. ఓడిపోతే? మరో ప్రయత్నంలో అయినా గెలిచితీరాలని పట్టుదలగా ప్రయత్నిస్తారు. టెన్నిస్‌లోనో ఇంకో ఆటలోనో పరాజితుడు విజేతతో కరచాలనం చేసి మైదానం నుంచి బయటికి వస్తాడు చూడండి...అంత హుందాగా వైఫల్యాల్ని ఒప్పుకోవాలి. ఓటమికి దూరంగా ఉన్నామంటే, గెలుపుకూ దూరంగా ఉన్నట్టే!

పదిహేనేళ్ల కాలంలో అమితాబ్‌ బచ్చన్‌ జీవితం ఎన్ని మలుపులు తిరిగింది! ఏబీసీ (అమితాబ్‌ బచ్చన్‌ కార్పొరేషన్‌) నష్టాలపాలైంది. అప్పులు పెరిగాయి. అవకాశాలు తగ్గిపోయాయి. దాదాపు దివాలా పరిస్థితి. డబ్బు జబ్బే ఉంటే, ఎవరైనా ఆ స్థితిలో కుప్పకూలిపోతారు. ఏ పక్షవాతమో గుండెపోటో మింగేస్తుంది. కానీ అమితాబ్‌ భయపడలేదు. సంపాదనని ఓ ఆటగా తీసుకున్నాడు. మళ్లీ సున్నా స్కోరు నుంచి మొదలుపెట్టాడు. ‘కౌన్‌బనేగా కరోడ్పతి' గేమ్‌షోకు యాంకర్‌గా చేయడానికి అంగీకరించాడు. అదు్భతమైన స్పందన వచ్చింది. మళ్లీ విజయాలు వెతుక్కుంటూ వచ్చాయి. కొడుకూ అందొచ్చాడు. కోడలేమో ప్రపంచ సుందరి. ఇప్పుడు, బచ్చన్‌ కుటుంబం బ్రాండ్విలువ అక్షరాలా వేయికోట్లని అంచనా.

ఆలోచనలే ప్రాణం-
శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి వందేళ్ల క్రితమే ఓ గొప్ప వ్యక్తిత్వవికాస రచన చేశారు. ఆ నవల పేరు ‘మార్గదర్శి'. ఇద్దరు స్నేహితులు జాతరకెళ్తారు. ఒకడి జేబులో ఎంతోకొంత చిల్లర ఉంటుంది. దారిపొడుగునా ఆ కుర్రాడు ఆ డబ్బు ఎలా ఖర్చు చేయాలా అనే ఆలోచిస్తుంటాడు. మరో కుర్రాడి దగ్గర చిల్లిగవ్వకూడా ఉండదు. కానీ ఆలోచనంతా డబ్బు సంపాదన మీదే.తిరిగొచ్చేసమయానికి మొదటి కుర్రాడి జేబులు ఖాళీ అయిపోతాయి. రెండోవాడి జేబులు నాణాలతో నిండిపోతాయి.

తేడా ఎక్కడుంది? ఆలోచనలో.

ఏం ఆలోచించాలన్నదీ మనమే నిర్ణయించుకుంటే, చెత్తాచదారమంతా బుర్రలో తిష్టవేసే ప్రమాదమే ఉండదు.చాలా సందర్భాల్లో తాత్కాలిక లక్ష్యాలు, తాత్కాలిక అవసరాలు .. దారితప్పించే ప్రయత్నం చేస్తుంటాయి. ఆ వలలోంచి బయటపడితేనే, దీర్ఘకాలిక లక్ష్యాల్ని నిర్ణయించుకోగలం. సాధించాలనుకున్నది సాధించగలం. రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ అధినేత అంజిరెడ్డి ఢిల్లీ యూనివర్సిటీలో చదువుకునే రోజుల్లో...రోజూ ప్రఖ్యాత మందుల కంపెనీ ‘ఫైజర్‌' కార్యాలయం ముందు నుంచి వెళ్లేవారు. ఆ బోర్డువైపు ఆరాధనగా చూస్తూ ‘ఏదో ఒకరోజు నేనూ ఇలాంటి సంస్థను స్థాపిస్తాను' అనుకునేవారు. ఆ ఆలోచనే అయనను దేశంలోనే రెండో అతిపెద్ద ఫార్మా కంపెనీకి అధినేతను చేసింది. ‘ఏదో ఒకరోజు ఈ సంస్థలో ఉద్యోగం చేయాలి' అనుకుని ఉంటే, ఫలితం మరోలా ఉండేది. అంజిరెడ్డి మహాఅయితే ఎగువ మధ్యతరగతి మనిషిగా మిగిలిపోయేవారు.

మార్కెటింగ్ మంత్రం-
మనదేశంలో కూడా పుస్తకాలు అమ్ముకుని కోట్లు సంపాదించుకోవచ్చని ఐఐటీ పూర్వవిద్యార్థి చేతన్‌భగత్‌ నిరూపించాడు. ఆ విజయం వెనుక అదు్భతమైన మార్కెటింగ్ నైపుణ్యం ఉంది. చాలామందికి పుస్తకాలు చదవాలనే ఉంటుంది. కానీ పుస్తకాల దుకాణం దాకా వెళ్లి కొనాలంటే బద్ధకం. అందుకే ఆ ఆలోచనే మానుకుంటారు. టీవీ చూస్తూనో, పేపర్‌ తిరగేస్తూనో కాలక్షేపం చేస్తారు. పుస్తకాల ధర మరో సమస్య. వందలకొద్దీ ఖర్చుచేయడానికి మధ్యతరగతి బడ్జెట్‌ అస్సలు ఒప్పుకోదు. చేతన్‌భగత్‌ ఈ రెండు పరిమితుల్నీ దృష్టిలో పెట్టుకుని మార్కెటింగ్ వ్యూహం తయారుచేశాడు. పుస్తకాల్ని పుస్తకాల షాపుల్లోనే ఎందుకమ్మాలి? సూపర్‌మార్కెట్లో ఏ కాల్గెట్‌ టూత్‌పేస్టు పక్కనో ఎందుకు పెట్టకూడదు? ఆ పుస్తకం ధర వంద రూపాయలలోపే ఉంటే, బడ్జెట్‌ పద్మనాభం సినిమా టికెట్‌తో పోల్చుకుని...సంతోషంగా కొంటాడుగా! ఆలోచన అదిరింది!! చేతన్‌భగత్‌ పుస్తకాలు సగటున నిమిషానికొకటి అమ్ముడుపోతున్నాయని అంచనా! ఇలా అతను రెండు కలల్ని నిజం చేసుకున్నాడు. ఒకటి, తనకిష్టమైన రచనా వ్యాసంగాన్ని వృత్తిగా స్వీకరించడం. రెండు, సొంతగడ్డమీదే ఉంటూ హాంకాంగ్లో ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్‌గా సంపాదించిన దానికంటే ఎక్కువ సంపాదించడం. తమ ఐడియాల్ని మార్కెట్‌ చేసుకున్నవారే విజేతలుగా నిలుస్తారనడానికి చేతన్‌భగత్‌ అతిపెద్ద ఉదాహరణ. ఫలానా రంగంలో ఉద్యోగం చేస్తేనే బోలెడంత డబ్బు సంపాదించుకోవచ్చనో, ఫలానా వ్యాపారమైతే బంగారు బాతుగుడ్డనో భ్రమిస్తే పొరపాటే. ఏది అదు్భతంగా అమ్ముడుపోతుంది అన్నది ముఖ్యం కాదు. నువ్వేం అదు్భతంగా తయారు చేయగలవు? అదీ ముఖ్యం. మన ఆర్థిక విజయాన్ని నిర్ణయించేదీ ఆ నైపుణ్యమే.
డబ్బు...మన సౌలభ్యం కోసం మనం సృష్టించుకున్న ఓ మారకం, ఓ అవసరం. ఆ సత్యాన్ని గుర్తించాలి. బాల్యం నుంచే పిల్లలకు ఆర్థిక పాఠాలు చెప్పాలి. పెద్దలు కూడా తమ పరిజ్ఞానాన్ని విస్తృతపరుచుకోవాలి. అలా అని డబ్బే లోకమనుకుంటే పొరపాటు. కోట్లకుకోట్లు కూడబెట్టాలనుకోవడం దురాశ. అడ్డదార్లు తొక్కడం అన్నిటికంటే పెద్దతప్పు. ‘అవసరాలకు మించి మన దగ్గరున్న డబ్బు మనది కాదు. ప్రజలది' అంటూ ఎంత సంపాదించుకోవాలనే విషయంలో మహాత్ముడో లక్ష్మణరేఖ గీశాడు. అపార సంపదల్ని సేవాకార్యక్రమాలకు దానమిచ్చిన ప్రపంచ కుబేరుడు వారెన్‌ బఫెట్‌ ఈ సూత్రాన్నే పాటించాడు. కోటీశ్వరులనీ, నవకోటి నారాయణులనీ దైవత్వాన్ని జోడించి మరీ మన పెద్దలు గౌరవించింది ఇలాంటి మనసున్న కుబేరులనే!

మన జేబులో వేయిరూపాయల నోటుంటే...మల్టీప్లెక్స్‌లో మంచి ఇంగ్లిష్‌ సినిమా చూడొచ్చు. సినిమా అయ్యాక రెస్టారెంట్‌కు వెళ్లొచ్చు. ఇంకో వందో రెండువందలో మిగిలుంటే టాక్సీలో ఇంటికి రావచ్చు. అదే, వేయిరూపాయల నోటుకు బదులుగా చిత్తుకాయితం ఉంటే?
ఎందుకూ పనికిరాదు. ఏమీ కొనుక్కోలేం.
వేయిరూపాయల నోటు అని మనం చెప్పుకునే గులాబీరంగు కాయితానికి మారకపు విలువ ఉంది. ఆ విషయాన్ని ప్రభుత్వం నిర్ధారించింది. ‘మారకం' అంటే మారడం. అవసరమైతే మన దగ్గరున్న డబ్బు, దాని విలువ మేరకు బియ్యంగా మారుతుంది, బిస్కెట్‌ పొట్లంగా మారుతుంది, సినిమా టికెట్టుగా మారుతుంది, బంగారు నెక్లెస్‌గా మారుతుంది. ‘ఏమిటి గ్యారెంటీ' అంటారా? కావాలంటే చూసుకోండి, ఆ నోటు మీద ‘ఐ ప్రామిస్‌ టు పే ద బేరర్‌ సమ్‌ ఆఫ్‌ థౌజండ్ రుపీస్‌' అని మాటిస్తూ రిజర్వు బ్యాంకు గవర్నరు సంతకం చేశారు. మంత్రిగారు హైదరాబాద్లో ఉంటే, ఆయన బామ్మర్ది నియోజకవర్గంలో హల్‌చల్‌ చేసినట్టు...పైపైన కనిపించే హంగామా కాగితం నోటుదే కానీ, అసలు సిసలు అధికారమంతా బంగారానిదే. ప్రభుత్వం ఓ వందకోట్ల విలువైన నోట్లు విడుదల చేయాలనుకుంటే, ఆ మేరకు బంగారం నిల్వల్ని పక్కనపెట్టాలి. అంటే, ఈ పచ్చకాయితాలు ఆ బంగారానికి ప్రతినిధులు. అందుకే వాటికంత పవరు! మొత్తంగా, మార్కెట్లో చలామణిలో ఉన్న నోట్ల విలువ...రిజర్వు బ్యాంకు దగ్గరున్న బంగారం నిలువకు సమానం!

డబ్బేం చెట్లకు కాస్తుందా? అంటుంటారు చాలామంది. హాస్యానికన్నా, వ్యంగ్యానికన్నా ఆ మాట నిజం. నిజంగానే డబ్బు చెట్లకు కాస్తుంది. అసలు డబ్బే ఒక చెట్టు. చెట్టు పెంచాలంటే ఎంత కష్టపడతాం! మొక్క నాటుతాం. నీళ్లుపోస్తాం. కంచెపెడతాం. ఎరువులేస్తాం. పెరిగి పెద్దయ్యేదాకా కంటిపాపలా కాపాడుకుంటాం. డబ్బు చెట్టు విషయంలోనూ అంత జాగ్రత్త అవసరం.
* రాయిరప్పా పెరగదు. ఇల్లు పెరగదు. కుర్చీ పెరగదు. సృష్టిలోని నిర్జీవుల్లో డబ్బుకు మాత్రమే పెరిగే గుణం ఉంది. ఎంత పెరగాలో కూడా మనమే నిర్ణయించుకోవచ్చు!
* మీ జేబులోని పర్సు ఎంత శుభ్రంగా, క్రమబద్ధంగా ఉంటే...మీరంత ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నట్టు. కుటుంబానికి చక్కని ఇల్లు ఎంత అవసరమో, ఇంటి పెద్దకు నాణ్యమైన పర్సూ అంతే అవసరం. నోట్లు పద్ధతిగా ఉన్నప్పుడు, ఏ నోటు బయటికి తీస్తున్నామో మనకు స్పష్టత ఉంటుంది. పొరపాట్లు జరిగే అవకాశం తక్కువ.
* ఇంట్లోంచి బయటికి కాలుపెడుతున్నప్పుడు జేబులో ఎంత డబ్బుందో ఓసారి చూసుకోవడం ఉత్తమం. బ్యాంకు ఖాతాల్లోని నిల్వల గురించి కూడా ఉజ్జాయింపుగా అయినా తెలిసుండాలి.
* ఆత్మీయులతో వడ్డీ ఆశించే ఆర్థిక లావాదేవీలు వద్దు. అత్యవసర పరిస్థితుల్లో చేబదులు ఇచ్చినా ... తిరిగి రాకపోయినా ఇబ్బందిపడమనుకుని ఇవ్వడమే ఉత్తమం. తిరిగొస్తే సంతోషమే. డబ్బు కారణంగా ఆత్మీయతలూ అభిమానాలూ దెబ్బతినకూడదు.

* ఎవరిచేతికైనా డబ్బు ఇస్తున్నప్పుడు గాజువస్తువంత జాగ్రత్తగా, పసిపాపంత ప్రేమగా అందివ్వాలి. అది ఎదుటి మనిషికిస్తున్న గౌరవం కాదు, డబ్బుకిస్తున్న గౌరవం. ఎప్పుడైనా పొరపాటున అగౌరవ పరిస్తే శ్రీమహాలక్ష్మికి ‘సారీ' చెప్పడానికి సంకోచించకండి.
* కాస్త చాదస్తంగా అనిపించవచ్చుకానీ, రోజువారీ ఖర్చుల వివరాలు ఓచోట రాసుకోవడం మంచి అలవాటు. దీనివల్ల అనవసరమైన వ్యయాలు దొరికిపోతాయి. మరుసటిరోజు జాగ్రత్తపడొచ్చు.
* ఏ కుటుంబానికైనా ఈ ఆరూ ముఖ్యం...అనుకోని అవాంతరాలు ఎదురైనప్పుడు ఆదుకోడానికి రిజర్వు మనీ, చిన్నదో పెద్దదో మనకంటూ ఒక ఇల్లు, పిల్లల పెద్దచదువులకు ఎంతోకొంత పొదుపు, ఇంటిల్లిపాదికీ ఆరోగ్య బీమా, మనంలేనప్పుడు కూడా మనలోటు తెలియకుండా గణనీయమైన మొత్తంలో టర్మ్‌పాలసీ, వృద్ధాప్యం సాఫీగా సాగిపోడానికి పింఛను నిధి.
* పొదుపు రెండు రకాలు. ఒకటేమో, ఖర్చుపెట్టగా మిగిలింది పొదుపు చేయడం. రెండు, పొదుపు చేయగా మిగిలింది ఖర్చుపెట్టడం. రెండోదే ఉత్తమ మార్గం.

పెళ్లిలో వధువు కాలి బొటన వ్రేలు తొక్కిస్తారెందుకు

మన శరీరాలు నరాల పుట్టలు. ఈ నరాల ద్వారా విద్యుత్తు ప్రవహిస్తుంటుంది. ఋణ, ధన విద్యుత్తున్న భాగంతో విద్యుత్తు ప్రవహిస్తూ ఉంటుంది. పాజిటివ్ మరియు నెగిటివ్ విద్యుత్తులు రెండూ కలిస్తేనే విద్యుత్తు పుడుతుంది కదా. అంటే అక్కడితో విద్యుత్ ప్రవాహం ఆగిపోతుందన్నమాట.

వరుడు కుడికాలి బొటనవ్రేలితో వధువు బొటనవ్రేలిని తొక్కిస్తే వారిద్దరిలో ప్రవహించే విద్యుత్తు కలిసి ఇద్దరూ ఒకటవుతారు. ఒకరి తలపై ఒకరు జీలకర్ర పెట్టించడం, ఏడడుగులు నడవడం... ఇత్యాది ప్రక్రియలన్నీ ఇద్దరినీ కలిపి ఒకటిగా చేయడం కోసమే.

అందుకే పైకి వారిద్దరుగా కనబడుతున్నా.... మానసికంగా, ఆలోచనాపరంగా ఒక్కటే. లెక్కల్లో 1+1=2. కానీ భార్యాభర్తల లెక్కల్లో 1+1=1. అప్పుడే ఆదర్శవంతమైన జంటగా ఉంటారు.

మంచి మాట


కష్టాల్లోనూ సుఖాల్లోనూ చలించకుండా ఉన్నవాడే ధీరుడు.
అటువంటి వ్యక్తి మాత్రమే అమృతత్వాన్ని చేరుకోగలడు.
చావుపుట్టుకలు సహజం. ఎవరూ తప్పించుకోలేరు.
వివేకవంతులు వాటి గురించి ఆలోచించరు


లాభాల్లో నష్టాల్లో కష్టాల్లో సుఖాల్లో
నీ మనసును అటూ ఇటూ పరుగెత్తనీకు.
సాధ్యమైనంత ప్రశాంతంగాస్థిరంగా ఉంచు.
ఆ స్థిరమైన మనసుతోనేజీవనసమరంలో అడుగుపెట్టు.


జ్ఞానులూ అజ్ఞానులూ జీవితాన్ని
వేరువేరు దృక్పథాలతో చూస్తారు.
అజ్ఞాని తన సుఖమే ధ్యేయంగా పనిచేస్తాడు.
జ్ఞాని లోకం కోసం కష్టపడతాడు


నీకిష్టమైనవి జరిగినప్పుడు పొంగిపోవద్దు.
నీకిష్టంలేనివి జరిగినప్పుడు కుంగిపోవద్దు.
 అనుకోని విధంగా జరిగినప్పుడుఉద్వేగానికి లోనుకావద్దు.
మాయలో చిక్కుకుపోకుండా స్థిరంగా ఉండు


నీకు నీవే ఆప్తుడివి.నీకు నీవే శత్రువువి.
నీకు నీవే శిక్షణ ఇచ్చుకుంటే,నీకు నీవే అధిపతివి అవుతావు


శ్రద్ధావాన్‌ లభతే జ్ఞానం.
శ్రద్ధలేకపోతే అంతా నాశనమవుతుంది.
మనసు కలుషితం అవుతుంది


కర్మయోగి తన బాధ్యతల్ని
ఇతరులకంటే సమర్థంగా నిర్వర్తిస్తాడు.
అతనికి కర్మయే ఉపాసన.
కర్మను మించిన పూజ లేదని భావిస్తాడు


నీకు అప్పగించిన బాధ్యతల్నిశక్తినంతా ధారపోసిసమర్థంగా నిర్వహించు.
నిన్నెవరూ పర్యవేక్షించాల్సినఅవసరమే రాకూడదు.
ఎవరి పనిని వారునేర్పుగా చేయడమే యోగం


నిజమైన పండితుడుసృష్టిలోని సమస్త జీవులనూ
సమాన దృష్టితో చూస్తాడు.
తరతమ భేదాలుండవు

Friendship



Friendship is not about “I m sorry “ its about “abbe teri galti hai
Friendship is not about “I m there for u “ its about “kahan marr gaya saale
Friendship is not about “Get well soon “ its about “ Itna piyega toh yehi hoga
Friendship is not about “I understand “ its about “sab teri wajah se hua manhus
Friendship is not about “I m happy for ur success “its about “chal party de saale
Friendship is not about “I care for u “ its about “kamino tumhe chhod ke kahan jaunga
Friendship is not about “I love that girl“ its about “saalo izzat se dekho tumhari bhabhi hain
F'ship is not about “All the best for ur career“ its about “ bahut hua, abhi toh switch mar saale

రాజశేఖర్‌రెడ్డి దేవాలయం

రూ. కోటితో తిరుపతిలో రాజశేఖర్‌రెడ్డి దేవాలయం
దివంగత రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టరు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి దేవాలయాన్ని తిరుపతిలో నిర్మించనున్నామని తుడా ఛైర్మన్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి స్థానికంగా మంగళవారం ప్రకటించారు. తన కుటుంబ పెద్దల అనుమతితో రూ. కోటి వ్యయంతో దేవాలయం, సమావేశ మందిరం, ఇటీవల తాను రాజశేఖర్‌రెడ్డిపై చేసిన పీహెచ్‌డీ పరిశోధక వ్యాసాలను గ్రంథాలయంగా ఏర్పాటు చేసేందుకు సంకల్పించానన్నారు. పార్టీలకు అతీతంగా నిర్మించే ఈ దేవాలయాన్ని తన సొంత స్థలంలో 3నెలల కాలంలో పూర్తిచేస్తామన్నారు. దేవాలయంలో రాజశేఖర్‌రెడ్డి పాలరాతి విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు. రాజశేఖర్‌రెడ్డికి సంబంధించిన సీడీలు, ఫొటోలు ఏ సమాచారం ఉన్నా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, తుడా ఛైర్మన్‌, తుడా కార్యాలయం, తిరుపతి చిరునామాకు పంపాలన్నారు. 098495 45556 సంప్రదించవచ్చన్నారు.

డిసెంబరులో శిల్పాశెట్టి పెళ్లి!


ముంబయి: పొడుగుకాళ్ల సుందరి.. బాలీవుడ్‌ భామ శిల్పాశెట్టి త్వరలోనే పెళ్లి కూతురు కానుంది. ప్రియుడు రాజ్‌కుంద్రాతో కలిసి ఏడడుగులు నడవనుంది. అయితే ఈ విషయాన్ని గోప్యంగా ఉంచాలనుకున్నా సాధ్యం కాలేదు. డిసెంబరులో లండన్‌లో ఆమె పెళ్లి జరగనుందనే విషయం బయటకు పొక్కింది. తన పాస్‌పోర్టు ఇప్పించాలని శిల్ప తండ్రి సురేంద్రశెట్టి సూరత్‌ కోర్టును ఆశ్రయించడంతో ఈ గుట్టు కాస్త రట్టయింది. లండన్‌లో జరిగే తన కూతురు వివాహా వేడుకలకు హాజరవ్వాలని అందులో సురేంద్ర పేర్కొన్నట్లు ఓ వార్తా సంస్థ తెలిపింది. దీంతో ప్రియుడు రాజ్‌కుంద్రాతో శిల్ప వివాహం ఎప్పుడనే విషయమై గత కొద్ది రోజులుగా నెలకొన్న ఉత్కంఠ తొలగిపోయింది. వివాహ అనంతరం శిల్ప లండన్‌లోనే స్థిరపడే అవకాశాలు కన్పిస్తున్నాయి. చీరల వ్యాపారిపై బెదిరింపులకు దిగిన కేసులో 2003లో సురేంద్రశెట్టి పాస్‌పోర్టును కోర్టు స్వాధీనం చేసుకుంది.

20 వేల హెచ్‌1బీ వీసాలు ఖాళీ

వాషింగ్టన్‌:భారతీయులు తీవ్రంగా పోటీపడే అమెరికా వీసాల్లో ఈసారి బోలెడు ఖాళీలున్నాయి. హెచ్‌1బీ వీసాల్లో 20 వేలు మిగిలి ఉన్నాయి. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కాబోతుండగా ఇన్నేసి ఖాళీలు ఉండటం ఇదే తొలిసారి. ఆగస్టు 7 నాటికి హెచ్‌1బీ వీసాల కోసం 49 వేల దరఖాస్తులు మాత్రమే వచ్చాయని అమెరికా పౌరసత్వ, వలస సర్వీసుల విభాగం అధికారులు పేర్కొన్నారు. 2010 ఆర్థిక సంవత్సరానికి వీసాల జారీ కోసం ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచే దరఖాస్తుల స్వీకరణ మొదలుపెట్టారు. తొలి అయిదురోజుల్లో 42 వేల దరఖాస్తులు రాగా, ఆ తర్వాత నెలన్నర కాలంలో కేవలం 7 వేలే వచ్చాయి. నాలుగు నెలలుగా దరఖాస్తులు స్వీకరిస్తున్నా, ఖాళీలు అలాగే మిగిలిపోయాయి. ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ మందగమనం, నిబంధనల్ని నిక్కచ్చి అమలు, పెద్దమొత్తంలో దరఖాస్తుల్ని తిరస్కరించటం కూడా ఈ పరిస్థితి తలెత్తటానికి కారణంగా భావిస్తున్నారు.

నివారణ చర్య

దగ్గుతున్నప్పుడు, తుమ్ముతున్నప్పుడు తప్పనిసరిగా నోటికి, ముక్కుకు గుడ్డ లేదా టిష్యూ పేపర్‌ అడ్డుపెట్టుకోండి. ఆ వెంటనే టిష్యూ పేపర్‌ పారెయ్యాలి. గుడ్డ అయితే ఉతకటానికి వేడినీటిలో వేసెయ్యాలి. చి చేతులు, వేళ్లు తరచుగా కళ్లు, ముక్కులు, నోటికి తగలకుండా చూసుకోండి. చిజలుబు లక్షణాలున్న వారి దగ్గరకు వెళ్లద్దు. ఎవరైనా తుమ్ముతున్నా, దగ్గుతున్నా.. వారి మనసుకు కష్టం కలగకుండానే.. ఓ మీటరు దూరంలో ఉండటం మేలు. చి ఫ్లూ జ్వర లక్షణాలు కనబడుతుంటే వెంటనే డాక్టరుకు చూపించుకోవటం అవసరం. మీ లక్షణాల గురించి ముందే ఆసుపత్రి సిబ్బందికి చెబితే.. మిమ్మల్ని త్వరగా చూసి అక్కడి నుంచి పంపేస్తారు. చి ఇంట్లోనూ, ఆఫీసులోనూ కూడా చేతులను తరచుగా సబ్బుతో కడుక్కోండి. ముఖ్యంగా దగ్గు, తుమ్ము తర్వాత తప్పనిసరిగా కడుక్కోండి. ముక్కు చీదిన ప్రతిసారీ చేతులు కడుక్కోవాలి. చి చుట్టుపక్కల ఎవరికి ఫ్లూ లక్షణాలున్నా తరచుగా చేతులు కడుక్కోవటం, మాస్కులు పెట్టుకోవటం.. ఈ రెండు చర్యలతోనే ఫ్లూ జ్వరాల వ్యాప్తిని చాలా సమర్థంగా అడ్డుకోవటం సాధ్యపడుతోందని అధ్యయనంలో తేలింది.

తీవ్రతలోనే తేడా
ఫ్లూ జ్వరానికీ, స్వైన్‌ఫ్లూ జ్వరానికీ ఆరంభ లక్షణాల్లో పెద్దగా తేడా ఉండదు. కాకపోతే మొదలైన తర్వాత.. సాధారణ ఫ్లూ జ్వరం దానంతట అదే క్రమేపీ తగ్గిపోయే రకం అయితే.. స్వైన్‌ ఫ్లూ మాత్రం చాలా వేగంగా ఊపిరితిత్తులను దెబ్బతీస్తుంది. ఊపిరితిత్తుల్లోని కణజాలం దెబ్బతినటంతో పాటు లోపలంతా నీరు చేరిపోయే ప్రమాదం ఎక్కువ. దీంతో వేగంగా మరణం ముంచుకొస్తుంది. అందుకే ప్రస్తుత పరిస్థితుల్లో గొంతునొప్పి, తలనొప్పి, జ్వరం వంటి ఫ్లూ లక్షణాలు కనబడితే దాన్ని నిర్లక్ష్యం చెయ్యటానికి లేదు. తప్పకుండా వైద్యులను సంప్రదించాలి.
నివారణ సాధ్యమే ముక్కుకు గుడ్డ కట్టుకోవటం, చేతులను తరచూ కడుక్కోవటం- ఈ రెండు చర్యల ద్వారానే ఫ్లూ, స్వైన్‌ఫ్లూలను నివారించుకోవటం సాధ్యమని తాజాగా రెండు అధ్యయనాలు స్పష్టంగా తేల్చి చెప్పాయి. ప్రస్తుతం జ్వరాలు వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో రోగులను ఆసుపత్రుల్లో చేర్చి, పూర్తిగా అందరికీ దూరంగా ఉంచటం సాధ్యం కాకపోవచ్చు. అందుకని ప్రతి ఒక్కరూ ఇంటి వద్దనే జాగ్రత్తలు తీసుకోవటం అవసరమని హాంకాంగ్‌ యూనివర్సిటీ పరిశోధకులు సూచిస్తున్నారు. ఫ్లూజ్వర బాధితులున్న 154 ఇళ్లలో అధ్యయనాలు చేసిన వీరు కొన్ని ముఖ్యమైన సూచనలు చేస్తున్నారు.
లక్షణాలు
దగ్గు,
తుమ్ములు
గొంతు నొప్పి
ముక్కు కారటం
వికారం,
నీళ్ల విరేచనాలు
తీవ్ర జ్వరం
తలనొప్పి
తీవ్రమైన బడలిక,
నిస్సత్తువ
విపరీతమైన ఒళ్లు నొప్పులు

Easy and Fast Weight Loss:

Tips for Easy and Fast Weight Loss:

Tip 1: Must drink minimum 8 glasses of water in a day.

Tip 2: Juices, cream, sugar in your coffee or tea all add up.

Tip 3: Water helps in reducing weight in effective manner.

Tip 4: Have 5 to 6 small meals or snacks in a day.

Tip 5: Make habit of walking. Walk for at least 45 minutes.

Tip 6: Eat more vegetables like zucchini, tomatoes.

Tip 7: Eat only when your stomach wants food.

Tip 8: Avoid package (processed) and convenient foods.

Tip 9: Take the stairs instead of taking the elevator.

Tip 10: Eat fruit rather than juice, low in calories helps.

Tip 11: Eating whole foods will keep you satisfied for longer period of time than juice.

Tip 12: Eat equal portions of vegetables and grains at dinner. Prefer not eating with a large group.

Tip 13: After every 2 hours, get up and walk around the office or your home for 5 minutes.

Tip 15: A brisk five-minute walk after every two hours will your body active. Skip watching TV for an hour.

మాంద్యం తరుణంలో ఎస్‌బీఐ


ఇంటర్మీడియట్‌ అర్హతతోనే బ్యాంకులో ఉద్యోగం సంపాదించుకోవటానికి ఇప్పుడో మంచి అవకాశం వచ్చింది. డిగ్రీ, పీజీలు పూర్తిచేసినవారు కూడా దీనికి పోటీ పడటం సహజం. ఈ పోటీ ఎంతన్నది ఆలోచించకుండా చిత్తశుద్ధితో అవిరళంగా కృషి చేస్తే బ్యాంకులో పాగా వేయటం అసాధ్యమేమీ కాదు!
ఎక్కడ చూసినా ఉద్యోగాల కోత వార్తలే. మాంద్యం తరుణంలో ప్రతిష్ఠాత్మకమైన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) భారీ సంఖ్యలో ఉద్యోగులను నియమించుకోబోవటం విశేషమే. ఆర్థిక మందగమనం వెంబడిస్తున్నా చెక్కుచెదరక, చక్కని ఫలితాలు సాధించిన ‘అత్యుత్తమ' బ్యాంకు ఎస్‌బీఐ.
అందుకే... 11 వేల క్లర్కుల నియామకం కోసం ఎస్‌బీఐ తాజాగా నోటిఫికేషన్‌ వెలువరించింది. ఇందులో మన రాష్ట్రానికి 900 ఖాళీలున్నాయి. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ సెప్టెంబరు 15. ‘ఆన్‌లైన్‌' ద్వారా మాత్రమే దరఖాస్తు చేయాలి. (ఇందుకోసం అభ్యర్థులకు ఈ-మెయిల్‌ ఐడీ తప్పనిసరిగా ఉండాలి). పరీక్ష తేదీలు నవంబరు 8, 15.

విద్యార్హత: 60 శాతం మార్కులతో ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణత లేదా 40 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత
వయసు: 18 నుంచి 28 సంవత్సరాల మధ్య.
వెబ్‌సైట్‌:www.sbi.co.in email: crpd@sbi.co.in

సమీప ఎస్‌బీఐ బ్రాంచిలో రూ. 250 డిపాజిట్‌ స్లిప్‌ ద్వారా చెల్లించి రిసీట్‌ పొందాలి. ఈ వివరాలను ఆన్‌లైన్‌ దరఖాస్తులో వివరించాలి.

ఆంధ్రప్రదేశ్‌లో పరీక్షా కేంద్రాలు
1.హైదరాబాద్‌ 2. తిరుపతి, 3. విజయవాడ 4. విశాఖపట్టణం
అభ్యర్థుల ఎంపిక రాత పరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా జరుగుతుంది.
ఆబ్జెక్టివ్‌ తరహాలో ఉండే రాత పరీక్షలో 5 విభాగాలు ఉంటాయి.
1. జనరల్‌ అవేర్‌నెస్‌ 2. జనరల్‌ ఇంగ్లిష్‌ 3. క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ 4. రీజనింగ్‌ ఎబిలిటీ 5.మార్కెటింగ్‌ ఆప్టిట్యూట్‌/కంప్యూటర్‌ నాలెడ్జి

రాత పరీక్షకు కనీస క్వాలిఫైయింగ్‌ మార్కులు 40 శాతంగా నిర్ణయించారు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ- రెండింటిలో ఉమ్మడిగా వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్‌ లిస్టు రూపొందిస్తారు.
ఎలా సిద్ధమవ్వాలి?
విభాగాల వారీగా ప్రిపరేషన్‌ విషయానికి వస్తే.. మొదటిది జనరల్‌ అవేర్‌నెస్‌.
అత్యధిక మార్కుల సాధనకు అవకాశం ఉన్న ఈ విభాగపు ప్రిపరేషన్‌ విషయంలో అభ్యర్థులు ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. కరెంట్‌ అఫైర్స్‌ విభాగంలో ఎక్కువభాగం ప్రశ్నలు ఆర్థిక రంగ అంశాలపైనే ఉంటాయి. వీటితోపాటు బ్యాంకింగ్‌, కొత్త పుస్తకాల విడుదల, విదేశాంగ పరమైన అంశాలు కూడా ప్రాధాన్యం కలిగి ఉంటాయి.

జనరల్‌ అవేర్‌నెస్‌ ప్రిపరేషన్‌లో ఎప్పటికప్పుడు అంశాలను ‘అప్‌డేట్‌' చేసుకుంటూ ఉండాలి. ప్రతి రోజూ న్యూస్‌ పేపర్‌ చదవడంతో పాటుగా ‘బ్యాంకింగ్‌ సర్వీసెస్‌ క్రానికల్‌', ‘కాంపిటీషన్‌ సక్సెస్‌ రివ్యూ' లాంటి ప్రామాణిక మ్యాగజీన్‌లను అభ్యర్థులు క్రమం తప్పకుండా చదవాలి.

ఇంగ్లిష్‌ ప్రిపరేషన్‌లో అత్యంత ముఖ్యమైన విభాగాలు గ్రామర్‌, ఒకాబులరీ. ఫండమెంటల్‌ గ్రామర్‌ పై పూర్తి అవగాహన పెంచుకోవడం, ఒకాబులరీ పెంపొందించుకోవడం ద్వారా ఇంగ్లిష్‌ విభాగంలో ఎక్కువ మార్కులు స్కోరు చెయ్యడానికి అవకాశం ఉంది.

క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ విభాగంలో శాతాలు, సరాసరి, నిష్పత్తి- అనుపాతం, లాభం- నష్టం, వడ్డీ, భాగస్వామ్యం వంటి టాపిక్స్‌ ముందుగా ప్రిపేర్‌ అవ్వడం ద్వారా డాటా ఇంటర్‌ప్రిటేషన్‌ను త్వరగా, కచ్చితంగా చెయ్యడం సాధ్యపడుతుంది.

అలాగే, క్లరికల్‌ పరీక్షలకు మరో ముఖ్యమైన అంశం సూక్ష్మీకరణ. ప్రాథమిక గణిత సమీకరణాలను బాగా సాధన చెయ్యాలి. దీనితోపాటు permutation and combination, Number series మొదలైనవి అభ్యాసం చేయాలి.

క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ విభాగం ఎక్కువ సమయం పట్టే విభాగం. అందువల్ల ఈ విభాగాన్ని చివరగా ప్రారంభించడం ద్వారా సమయం వృథా కాకుండా చూడవచ్చు.

రీజనింగ్‌ విభాగంలో ప్రశ్నలకు లాజికల్‌ ధింకింగ్‌ ద్వారానే ఎక్కువ సమాధానాలు చెయ్యడం సాధ్యం అవుతుంది. ఇచ్చిన ప్రశ్నలను క్షుణ్ణంగా పరిశీలించి ‘లాజిక్‌' పట్టెయ్యటం ముఖ్యం.
నాన్‌ వెర్బల్‌ ప్రశ్నలకు సైతం ప్రశ్నను క్షుణ్ణంగా పరిశీలిస్తే సమాధానం గుర్తించడం తేలిక.

క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ రీజనింగ్‌ విభాగాలకు సంబంధించి సాధన ఎంత ఎక్కువగా చేస్తే అంత సులువుగా సాల్వ్‌ చేయడానికి వీలవుతుంది.

గత పరీక్షల పేపర్లు, ప్రాక్టీసు పేపర్ల మెటీరియల్‌ విస్తృతంగా లభ్యం అవుతుంది. అందువల్ల వీలయినన్ని ఎక్కువ పేపర్లు ప్రాక్టీసు చేయడం ద్వారా ఈ విభాగాలలో బాగా మార్కులు పొందొచ్చు.

మార్కెటింగ్‌ ఆప్టిట్యూడ్‌, కంప్యూటర్‌ నాలెడ్జి రెండూ కలిపి ఒక విభాగంలో ఉంటాయి. మార్కెటింగ్‌ ప్రిపరేషన్‌ విషయంలో- ప్రస్తుత మార్కెటింగ్‌ విషయాలను పరిశీలన చేసి పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు. అంటే మార్కెటింగ్‌ ప్రిపరేషన్‌ విషయంలో టెక్‌స్ట్‌ బుక్‌ ప్రిపరేషన్‌ పాత్ర తక్కువ. మార్కెటింగ్‌ మౌలిక అంశాల ప్రిపరేషన్‌ కోసం ప్రామాణిక పుస్తకాలను ప్రిపేర్‌ అయితే సరిపోతుంది.

బ్యాంకులకు సంబంధించిన ప్రొడక్ట్స్‌ మార్కెటింగ్‌ ఇన్సూరెన్స్‌ మొదలైన అంశాలపై అవగాహన పెంచుకోవాల్సి ఉంటుంది. కంప్యూటర్‌ నాలెడ్జి విషయంలో మౌలికాంశాల పట్ల అవగాహన అవసరం. చిన్న చిన్న విషయాలపై (సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌, ప్యాకేజీ, లాంగ్వేజీ- వాటి మధ్య భేదాలు) ప్రశ్నలు వస్తుంటాయి. దాదాపుగా డిగ్రీలో అన్ని కోర్సులకూ కంప్యూటర్‌ ఒక పేపరుగా ఉంటుంది కాబట్టి, కంప్యూటర్‌ ప్రిపరేషన్‌ సులువే.

మార్కెటింగ్‌ ఆప్టిట్యూడ్‌, కంప్యూటర్‌ నాలెడ్జి విభాగంలో క్వాలిక్యులేషన్స్‌ వంటి సమయం ఎక్కువ పట్టే అంశాలు ఉండవు. కాబట్టి, తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు స్కోరు చేయడానికి అవకాశం ఉంది.
తప్పు సమాధానాలకు నెగిటివ్‌ మార్కులు ఉన్నాయి. ప్రతి తప్పు సమాధానానికీ 1/4 మార్కు కట్‌ అవుతుంది. సమాధానాలను గుర్తించేటప్పుడు వూహించి లేదా లాటరీ పద్ధతిలో సమాధానాలు గుర్తించడం సరైన పద్ధతి కాదు. కచ్చితమైన సమాధానాన్ని ధ్రువపర్చుకొని మాత్రమే ్చ్మ్మ్ఠ్ఝ్ప్మ చేయడం మంచిది.

ప్రిపరేషన్‌కు దాదాపుగా 3 నెలల సమయం ఉంది. కాబట్టి, చక్కని ప్రణాళికతో ప్రిపేర్‌ అవ్వొచ్చు.

చి ముందుగా క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, రీజనింగ్‌ సబ్జెక్టుల ప్రాక్టీసు పేపర్లు వీలైనన్ని ఎక్కువగా సాధన చేయాలి.
చి మార్కెటింగ్‌ మౌలిక అంశాలు( ఫండమెంటల్స్‌) ముందుగా ప్రిపేర్‌ అయి తర్వాత ప్రస్తుత మార్కెటింగ్‌ అంశాలపై పరిశీలనాత్మక పరిజ్ఞానం (Observation of present marketing conditions) పెంపొందించుకొని చక్కటి నోట్సు తయారు చేసుకోవాలి.
చి జనరల్‌ అవేర్‌నెస్‌కు సుమారుగా 6 నెలల కరెంట్‌ అఫైర్స్‌ ప్రిపేర్‌ అయి ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసుకుంటూ ఉండాలి. ప్రతిరోజూ క్రమం తప్పకుండా పేపర్‌ చదవడం అవసరం.
చి ఇంగ్లిష్‌ సబ్జెక్టుకు గ్రామర్‌, ఒకాబులరీ ప్రిపరేషన్‌పై దృష్టి పెట్టాలి.

అభ్యర్థి ఆత్మవిశ్వాసం, నిజాయితీ, ఆశావహ దృక్పథంలాంటి లక్షణాల పరిశీలనకు ఉద్దేశించిన వ్యక్తిత్వ పరీక్షే ఇంటర్వ్యూ.

ఎక్కువ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ వచ్చినందున అభ్యర్థులు ప్రణాళికాబద్ధమైన ప్రిపరేషన్‌తో ఎస్‌బీఐ ఉద్యోగం సాధించవచ్చు.
3 నెలల ప్రిపరేషన్‌ ప్రణాళిక
జి.ఎస్‌. గిరిధర్‌
డైరెక్టర్‌ ళితిదిని ఇన్‌స్టిట్యూట్‌
ఎస్‌బీఐ నుంచి వచ్చిన భారీ నోటిఫికేషన్‌ నిస్సందేహంగా నిరుద్యోగులకు వరం లాంటిది. ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకోవటానికి శక్తివంచన లేకుండా శ్రమించాలి. పరీక్ష కోసం ఎలా సన్నద్ధం కావాలో, ఏ విధంగా సాధన చేస్తే విజయం వరిస్తుందో చూద్దాం.
‘చక్కని ప్రారంభంతో సగం పని పూర్తయినట్లే'నని నానుడి. కాబట్టి, మరో 3 నెలల సమయంలో జరగబోయే ఎస్‌బీఐ క్లరికల్‌ పరీక్ష రాసేవారు ఏవిధంగా సన్నద్ధంగా ఉండాలో ముందే ఒక అవగాహనకు రావాలి.

మొదట పరీక్ష విధానం గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ఎన్ని సబ్జెక్టులుంటాయి? వాటి సిలబస్‌ ఏమిటి? ఏ సబ్జెక్టుకు ఎంత సమయం కేటాయించాలి? లాంటి వాటిపై అవగాహన పెంచుకోవాలి.

చిపరీక్షలో ఉండే ఐదు సబ్జెక్టుల్లో మొత్తం సిలబస్‌ కవరయ్యేలా పుస్తకాలు, స్టడీ మెటీరియల్‌ సేకరించాలి. ఇంతకుముందు పరీక్ష రాసిన అభ్యర్థుల, నిపుణుల సలహాలు తీసుకుంటే మంచిది.
చిరోజుకు కనీసం 5-6 గంటలకు తక్కువ కాకుండా సమయం కేటాయించుకోవాలి. ప్రతి రోజూ అన్ని సబ్జెక్టులు కవర్‌ అయ్యేవిధంగా చూసుకోవాలి.
చి అన్నింటికీ ఒకేవిధమైన సమయాన్ని కాకుండా దాని క్లిష్టతను బట్టి కేటాయించడం సరైనది. Quantitative Aptitude, (Q.A.) Reasoning అధిక వ్యవధి పడుతుంది. కాబట్టి వాటికి ఎక్కువ సమయం కేటాయించాలి.

ప్రాథమికాంశాలపై పట్టు
అన్ని సబ్జెక్టుల సిలబస్‌ను పరిశీలించి దాని ప్రకారం ఆయా సబ్జెక్టుల్లో ఉండే అంశాలపై మంచి పట్టు సాధించాలి. శీ.తి.లో ఉండే అంకగణితం తిri్మ్త్ఝ్ఠ్మi్ఞలోని ప్రతి అంశంపై బాగా అవగాహన ఉండాలి.

చి గత ప్రశ్నపత్రాల్లో ఎక్కువ ప్రశ్నలు ఏ అంశాల నుంచి వస్తున్నాయో గమనించి, వాటిపై ఎక్కువ శ్రద్ద వహించాలి.
చి ఈ మధ్య కాలంలోని పరీక్ష పత్రాలను గమనిస్తే... ప్రస్తారాలు- సంయోగాలు (పర్మ్యుటేషన్స్‌ అండ్‌ కాంబినేషన్స్‌) నుంచి ప్రశ్నలు అధికంగా వస్తున్నాయి.
చి పరీక్షకు మూడు నెలల సమయం ఉంది కాబట్టి, అంకగణితంలోని అన్ని అంశాలలోని ప్రతి ప్రశ్నను కనీసం నాలుగైదు సార్లు సాధించేలా చూసుకోవాలి.
లెక్కలంటే బెరుకా?
గణితాన్ని ఇంటర్లో, డిగ్రీలో సబ్జెక్టుగా చదవని విద్యార్థులు లెక్కలంటే గాభరా పడాల్సిన పనిలేదు. ముందుగా తేలికపాటి ప్రశ్నలను సాధిస్తూ సన్నద్ధం కావాలి. తర్వాత క్లిష్టతను పెంచుకుంటూ వెళ్లాలి. వీరు మిగిలిన వారికంటే కంటే ఎక్కువ సమయం సాధనకు కేటాయించాలి. రోజూ కనీసం 4-5 గంటలైనా లెక్కలు అభ్యాసం చేయాలి.

చి శీతిప్రాక్టీస్‌ చేసేప్పుడు సాధారణ పద్ధతిలో కాకుండా ఇంకా సులభంగా చేయెచ్చునేమో గమనించాలి. దీంతో షార్ట్‌కట్‌ పద్ధతులు తెలుస్తాయి. కొన్ని ప్రశ్నలను సాధించకుండానే ఆప్షన్స్‌ను చూసే సరైన జవాబు గుర్తించవచ్చు. ప్రశ్నలో కండిషన్స్‌ ఇస్తే వాటికి ఈ పద్ధతి వర్తిస్తుంది. కొన్ని తరహా ప్రశ్నలు పరీక్షలో తరచుగా వస్తుంటాయి. వాటికి సూత్రాలు గుర్తుంచుకుంటే సరిపోతుంది.

అన్నింట్లోనూ...
చిఎస్‌బీఐ పరీక్షకున్న 3 నెలల సమయానికి ఒక టైమ్‌ టేబుల్‌ను రూపొందించుకోవాలి. ప్రతిరోజూ అన్ని సబ్జెక్టులు కవర్‌ అయ్యేలా ప్రణాళిక వేసుకోవాలి. అన్నింటికిమించి ఆ టైమ్‌ టేబుల్‌కు కట్టుబడి ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాక్టీస్‌ ఆపకూడదు.
చి బ్యాంకు పరీక్షలో విజయం సాధించాలంటే అన్ని సబ్జెక్టుల్లోనూ విడివిడిగా ఉత్తీర్ణులవ్వాల్సి ఉంటుంది. కాబట్టి, అన్నింటికీ ప్రాధాన్యమివ్వాలి. సాధ్యమైనన్ని నమూనా పరీక్షలు (మాక్‌ టెస్ట్‌లు) చేయాలి. సమయం చూసుకుంటూ సాధన చేయాలి.
చి శీతి పేపర్‌ను 30 నిమిషాల్లో 40 ప్రశ్నలు సాధించేలా తయారవ్వాలి. క్లరికల్‌ పరీక్షలో చాలావరకూ ప్రాథమికాంశాల మీదనే ప్రశ్నలుంటాయి కాబట్టి ఆందోళన అనవసరం.
చి జనరల్‌ అవేర్‌నెస్‌ కోసం గత ఆరునెలల వర్తమాన అంశాల(కరెంట్‌ ఎఫైర్స్‌)పై అవగాహన ఉండాలి. ఇప్పటినుంచి పరీక్ష తేదీ వరకు ప్రతిరోజూ వార్తాపత్రికలను (ఈనాడు, ఎకనామిక్స్‌ టైమ్స్‌) కనీసం 2 గంటల పాటు పరీక్ష కోణంలో క్షుణ్ణంగా చదవాలి. ఎకానమీ వార్తలకు ప్రాధాన్యమివ్వాలి.
చి మార్కెటింగ్‌, కంప్యూటర్స్‌ సబ్జెక్టులపై చాలా పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ఎంఎస్‌ ఆఫీస్‌ గురించి బాగా తెలిసి ఉండాలి. వాటి నుంచి ప్రశ్నలుంటాయి.
చి పరీక్ష సమయం వరకు అన్ని సబ్జెక్టులను కనీసం 2-3 సార్లు పునశ్చరణ అయ్యేలా చూసుకోవాలి. Mental calculations, Speed Maths బాగా ప్రాక్టీస్‌ చేయాలి.
మాదిరి ప్రశ్నపత్రాలను చేస్తున్నప్పుడు సబ్జెక్టుల క్లిష్టతను బట్టి సమయాన్ని కేటాయించుకోవాలి. తేలికపాటి ప్రశ్నలను ముందుగా చేసి ఆ తర్వాత కష్టమైన ప్రశ్నలను సాధించేలా సాధన చేస్తే పరీక్షలో ఎక్కువ ప్రశ్నలు సాధించే వీలుంటుంది.

90 శాతం చేస్తేనే...
200 ప్రశ్నలుండే మాదిరి ప్రశ్నపత్రాల్లో 170-180 ప్రశ్నలను 90 శాతం ్చ్ఞ్ఞ్యr్చ్ఞ్వతో సాధించగలగాలి. అలా చేయగల్గినప్పుడే పరీక్షకు సరైనవిధంగా సిద్ధమైనట్లు. లేదంటే ప్రాక్టీస్‌ మరింత ముమ్మరం చేయాలి.

చి మాదిరి ప్రశ్నపత్రాలను చేస్తున్నప్పుడు సబ్జెక్టుల క్లిష్టతను బట్టి సమయాన్ని కేటాయించుకోవాలి. తేలికపాటి ప్రశ్నలను ముందుగా చేసి ఆ తర్వాత కష్టమైన ప్రశ్నలను సాధించేలా సాధన చేస్తే పరీక్షలో ఎక్కువ ప్రశ్నలు సాధించే వీలుంటుంది.

పరీక్ష గదిలో...
ముందుగా జనరల్‌ అవేర్‌నెస్‌, మార్కెటింగ్‌, కంప్యూటర్‌ సబ్జెక్టులు, ఆ తర్వాత ఇంగ్లిష్‌ పూర్తి చేసి; మిగిలిన సమయంలో శీ.తి., ళ్ఠ్చ్బ్న్థిi్థ్ణ సబ్జెక్టులను చేస్తే సమయం కలిసొస్తుంది.

చి సాధారణంగా లెక్కలు చేస్తున్నప్పుడు ఎంత సమయం గడుస్తుందో తెలియదు. మిగిలిన సబ్జెక్టులపై ఆ ప్రభావం పడకుండా ఉండాలంటే లెక్కలను చివరలో చేయడం మంచిది.
చి ఏదైనా ప్రశ్నకు జవాబు వెంటనే స్ఫురణకు రాకపోతే దానిని వదిలేసి వేరొక ప్రశ్నకు వెళ్లడం మంచిది.
చి అన్ని ప్రశ్నలూ పూర్తిచేయలేకపోయామని ఆందోళన వద్దు. కానీ అన్ని సబ్జెక్టులలో కనీసం 80-90 శాతం ప్రశ్నలు చేసేలా జాగ్రత్త పడాలి.
ఈ సూచనలన్నింటినీ పాటిస్తే విజయం తప్పక లభిస్తుంది.

total 616 swine flu cases in India

New Delhi, Aug 6 (IANS) The capital reported 11 cases of swine flu and Pune eight taking the total number of infected people in the country to 616 Thursday amid panic in the two cities for the second consecutive day with hundreds flocking testing centres for screening.

Nineteen laboratory-confirmed cases have been reported today: Delhi (11) and Pune (8), the health ministry said in a statement.

Of the 616 positive cases, 487 have been discharged so far. One patient - Reeda Shaikh, a 14-year-old girl from Pune - died Monday. The rest remain admitted to the identified health facilities, the ministry said.

Out of the 11 cases in Delhi, 10 are contact cases of previously reported positive cases. They have no travel history. The 11th case is a 25-year-old man who arrived here from Chicago July 28. He reported with symptoms Wednesday and was found positive with the influenza A(H1N1) virus.

Out of the eight new cases in Pune, seven are indigenous and the eighth case is a 45-year-old woman who travelled from Frankfurt via Mumbai.

Meanwhile, hundreds of people in Pune and Delhi rushed to designated hospitals for a check-up. While around 800 'voluntary patients' went to the Naidu Hospital in Pune, at least 265 patients went for screening at the Ram Manohar Lohia (RML) Hospital in the capital.

'There is fear and people will come to the hospital. But it is the duty of doctors in public service to give their best for the betterment of the country. My doctors are fully committed to screen and counsel whoever comes in,' S.K. Sharma, medical officer of RML, told IANS.

'There was no chaos or mismanagement. Our screening centres are open round the clock to help anyone,' Sharma added after taking care of over 260 visitors in his hospital.

Total solar eclipse



Wed, Jul 22, 2009 05:37 AM
New Delhi, July 22 (IANS) As dawn broke Wednesday, the century's longest total solar eclipse began with thousands of sky gazers craning their neck skywards to catch the glimpse of the rare celestial spectacle.

The sun rose eclipsed Wednesday morning at 5:28 a.m. at a local sunrise point in the Arabian Sea close to the western coast of India near Surat in Gujarat.

Thousands of people, children and adults, thronged the sky watching sites across the country with their solar goggles to watch the eclipse.

In India, the totality phase will last for some 3 minutes 30 seconds and places like Surat in Gujarat, Indore and Bhopal in Madhya Pradesh, Varanasi in Uttar Pradesh and Patna and Taregna in Bihar will observe the total solar eclipse.

The total eclipse will be between 6:20 a.m. to 6:25 a.m. when sun will be completely obscured by the moon.

The total phase of the eclipse is expected to last 6 minutes and 44 seconds, making it the longest eclipse of the century. The next such celestial spectacle will take place 2132.

శివాలయాల్లో ప్రదక్షిణ


అన్ని దేవాలయాలలో చేసే ప్రదక్షిణ వేరు, శివాలయంలో చేసే ప్రదక్షిణ వేరు. శివాలయాల్లో ఏ విధంగా ప్రదక్షిణ చేయాలో, అలా చేయడం వలన ఎలాంటి ఫలితాలు పొందవచ్చో పురాణాల్లో స్పష్టంగా పేర్కొన్నారు.

శివాలయం ధ్వజస్తంభం దగ్గర నుంచి మనకు ఎడమ పక్కగా బయలుదేరి గర్భాలయానికి వెనుక ఉన్న సోమసూత్రం( శివుని అభిషేక జలం బయటకు పోయే మార్గం) వరకూ వెళ్లి వెనుతిరగాలి. కానీ సోమసూత్రం దాటరాదు.

అక్కడ నుంచి వెనుదిరిగి అప్రదక్షిణంగా మళ్లీ ధ్వజ స్తంభాన్ని చుట్టుకుని సోమసూత్రం వరకూ రావాలి. ఇలా చేస్తే ఒక ప్రదక్షిణ ముగిసినట్లు. ఈ విధమైన ప్రదక్షిణలు శివునికి భక్తులు బేసి సంఖ్యలో వచ్చే విధంగా 3,5,7,9 ప్రదక్షిణలు చేయవచ్చు.

శివప్రదక్షిణలో సోమసూత్రాన్ని దాటరాదన్నది ప్రధాన నియమం. అలాచేస్తే ఎన్ని ప్రదక్షిణాలు చేసినా ఒక ప్రదక్షిణ కిందకే వస్తుందంటుంది శాస్త్రం.

వరుణ యాగం


వచ్చేనెల July 2, 3, 4 తేదీల్లో హైదరాబాదులోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో భారీ ఎత్తున "వరుణ యాగం" నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పుష్కలంగా వర్షాలు కురవాలని కోరుతూ.. తిరుమల-తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ వరుణయాగం జరుగుతుందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి గాదె వెంకటరెడ్డి విలేకరులతో తెలిపారు.

ఈ యాగం కోసం 108 హోమ గుండాలను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి అన్నారు. వేద పండితులు, రుత్వికులు శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని వెంకటరెడ్డి వివరాలందించారు. దీంతో పాటు రాష్ట్రంలోని వెయ్యి ప్రధాన దేవాలయాల్లో కూడా వరుణ జపాలు, సహస్ర ఘటాభిషేకాలు జరుగుతాయని ఆయన వెల్లడించారు.

జూలై 2వ తేదీన హైదరాబాదులోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ప్రారంభం కానున్న వరుణయాగం కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి ప్రారంభిస్తారని, అలాగే ముగింపు రోజు కూడా సీఎం పాల్గొంటారని మంత్రి తెలియజేశారు.

ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీరు ఘోష

సాఫ్ట్ వేర్ ఇంజనీరు - నాడు
ఒకప్పుడు:
@ హోం టౌన్(సొంత ఊరు): చుట్టాలు/బంధువులు/స్నేహితులు: ఏంటి బాబు వీకెండ్ అని ఇంటికి వచ్చావా...సాఫ్ట్ వేర్ కంపెనీలో పని చేస్తున్నావటగా....?? బాగానే ఇస్తునట్టున్నారుగా.... ఇంకేంటి సెటిల్ ఐపోయావు కదా... పెళ్ళి సంగతి ఏంటి...?? ఎంతలో ఉన్నారు మీ అమ్మావాళ్ళు (కట్నం)..? సాఫ్ట్ వేర్ ఇంజనీరే కదా బాగానె ఉండుంటుందిలే నీ రేట్...

@ హైదరాబాద్: ఆటో డ్రైవర్: సాబ్ నమస్తే సార్....రండి సార్ కూర్చోండి కూర్చోండి...ఎక్కడికి వెళ్ళాలి... ఎక్కడికైనా మినిమం 50 రూపాయలు మీకేంటి సర్...నెలకి ఒక 25,000 వస్తాయి కదా... మాకు ఇచ్చే 50 ఏమి లెక్కలే మీకు...

ఇంటి ఓనర్: ఏంటీ సాఫ్ట్ వేర్ కంపెనీలొ పని చేస్తున్నావా..?? ఐతే రెంట్ 7,000/- ప్రతీ మూడు నెలలకి మీకు హైక్స్ (ఇంక్రిమెంట్లు) వస్తాయట కదా..అదే విధంగా మా ఇంటికి రెంట్ కూడా 3నెలలకి ఒకసారి 750 ఇంక్రిమెంట్ అన్నమాట.... ఐనా ఇవి అన్నీ మీకు ఒక లెక్కా పాడా.... మీకు 31 రాత్రికి ఒక 30,000 వస్తాయట కదా...

షాపు ఓనర్: సార్ సాఫ్ట్ వేర్ ఉద్యోగి అయ్యి ఉండి ఇంకా 25 రూపాయలకి కేజీ బియ్యం వాడుతున్నారు ఏంటి సర్..... ఇదిగోండి సార్ సాఫ్ట్ వేర్ ఉద్యోగుల కోసం 42 రూపాయలకి కేజీ బియ్యం .... అసలు మీరు అటూ ఇటూ తిరగనవసరం లేదు ......తిన్న వెంటనె అదే డైజెస్ట్ ఐపోతుంది సార్...అసలే సాఫ్ట్ వేర్ వాళ్ళు ఎటూ తిరగకుండా ఒకే కుర్చీలో కూర్చుని ఉంటారంటకదా ....సార్ ఇంకా లేటెస్ట్ ఇంపోర్టెడ్ పెర్ఫ్యుం లు కూడా వచ్చాయి సార్..ఒకటి తీసుకొని వెళ్ళి ట్రై చెయ్యండి...తరువాత మీకు నచ్చిన ఫ్లేవర్స్ తీస్కొని వెళ్ళొచ్చు...ఐనా మీ దగ్గర డబ్బులు ఎక్కడికి పోతాయి సార్....
నేడు.........

@ హోం టౌన్(సొంత ఊరు): చుట్టాలు/బంధువులు/స్నేహితులు: ఏంటి బాబు ఇంటికి వచ్చావు....కొంప తీసి తీసేసారా ఏంటి..?? అహ అంటే ఏమి లేదు ఈ మద్య అందరిని తీసేస్తున్నారు కదా..అందుకని.. ఐనా ఎందుకు అయ్యా ఆ సాఫ్ట్ వేర్ జాబులు... ఎప్పుడు తీసేస్తారో తెలియదు,ఉంచుతారో తెలియదు... మీ జాబ్ కే సెక్యూరిటీ లేనప్పుడు ఇక మీరు పెళ్ళి చేసుకొని ఏమి ఉద్ధరిస్తారు... అసలు మీకు ముందు అమ్మాయిలను ఎవరు ఇస్తారులే...

ఆటో డ్రైవర్: సార్ మరీ, చీ..చీ వీడిని సార్ ఏంటి ఇంకా....ఇదిగొ చూడు తమ్ముడు ఈ ఆటో వెళ్ళదు కాని ముందుకు పొయ్యి బస్టాప్ లో నుంచో.. నేను అడిగినంత ఇచ్చే పరిస్థితిలో నువ్వు లేవులే కాని..లైట్ తీస్కో......

ఇంటి యజమాని: బాబు మేము ఇల్లు ఫామిలీస్ కి ఇద్దాం అనుకుంటున్నాము.... మీరు త్వరగా ఖాలీ చెయ్యండి... ఐనా బాచిలర్స్ కి ఇంత పెద్ద ఫ్లాట్ అవసరంలేదనుకుంటా....కొంచెం చిన్నరూంలు ఉంటే చూసుకొని...అర్జెంటుగా ఏమి కాదులే..ఒక 5, 6 రోజుల్లో ఖాళీ చెయ్యండి...

షాపు ఓనర్: అరెయ్ ఎవరు అక్కడ.... వచ్చిన వాడికి ఎన్ని కేజీల బియ్యం(25రూపాయలకు కేజీ వి) కావాలో చూసి ఇచ్చి పంపండి..డబ్బులు ఇస్తేనే ఇవ్వండి....అప్పులేదని చెప్పండి...

ఆఖరికి అమ్మాయిలు కూడా చూడండి తమ పెళ్ళిళ్ళకు ఎటువంటి నిబంధనలు విధించారో :( !!
పెద్దగా చూడడానికి కింది చిత్రం మీద క్లిక్ చెయ్యండి.




ఇదీ నేటి సాఫ్ట్ వేర్ ఉద్యోగుల జీవితం...

సాఫ్ట్ వేర్ ఉద్యోగులా ..??? మీకేంటి కేక అని మాకు లేని పొగరు తెప్పించేది మీరే... ఇంకా మీ పని ఐపోయింది గా అని చులకన చేసి నవ్వేదీ మీరే... సాఫ్ట్ వేర్ కంపెనీలు కూడా నిన్నటి దాకా వేలకి వేలు జీతాలు ఇచ్చి ఈరోజు నుంచి ఇక రావొద్దని ఎందుకు చెప్తారో తెలీదు...భారతదేశంలో ఓ ఉద్యోగిని కారణం చెప్పకుండా తీసేస్తే వాళ్ళ ఉద్యోగుల యూనియన్లు ఊరుకుంటాయా? ఊరుకోవు... కేవలం సాఫ్ట్ వేర్ ఉద్యోగులకి ఒక యూనియన్ లేకపోవటమే దీనంతటికీ కారణమా..??

చైనా మీరాబాయి


ఆమె ఒంటరి. కానీ ఆ మాట అంటే ఒప్పుకోదు. తనకు తోడు కృష్ణుడు వున్నదంతుంది. ఆయన్ను ప్రేమిస్తుంది పూజిస్తుంది. అయితే , ఆమె మన మీరాబాయి కాదు. చైనా దేశస్తురాలు వెన్ కున్ రాంగ్. కలకత్తా లోని చైనా టౌన్ లో Restaurent ని నిర్వహిస్తున్న 54 ఏళ్ల కున్ రాంగ్ కు కృష్ణుడంటే అపారమైన ప్రేమ. దేశ దేశాలు తిరిగి ఎన్నో హావభావాల్లో వున్నా 20 వేల కృష్ణుడి ఫోటోలు, బొమ్మలను కుడా సంపాదించింది. అసలు హిందూ మతం గురించి తెలియని చైనా మహిళకు కృష్ణుడి తో అనుబందం ఎలా ఏర్పడిందో తెలుసా..... 20 ఏళ్ల వయసు లో కున్ రాంగ్ కు ఓ బెంగాలీ స్నేహితురాలు కృష్ణుడి బొమ్మను బహుమతిగా ఇచ్చిన దంట. దాన్ని చూసిన క్షణంలో ఆమెకు ఏదో తెలియని మధురానుభూతి . తరువాత ఆ కృష్ణుడే ఆమెకు జీవితమయ్యాడు. కృష్ణుడే ఎదురుగ వున్నట్లు గడిపేస్తుంది. కున్ రాంగ్ ఎవరైతే నేఁ ........ ప్రేమ ప్రేమే ..........